Train: సీటు వెతుక్కుని కూర్చొనేలోపే స్టేషన్ వచ్చేస్తుంది.. మన దేశంలో అతి చిన్న రైలు ప్రయాణం..ఎక్కడో తెలుసా?

Published : Aug 13, 2026, 12:48 PM IST

Train: రైలు ఎక్కి, మన సీటు నెంబర్ ఎక్కడ ఉందా అని చూసుకొని.. జస్ట్ అలా కూర్చున్నామో లేదో.. మనం దిగే స్టేషన్ వచ్చేస్తుంది. కేవలం 7 నిమిషాల్లో రైలు ప్రయాణం ముగుస్తుంది. ఇది ఎక్కడో తెలుసా?

PREV
13
Train Journey

మన దేశంలో ఎక్కువ మంది ఇష్టపడే ప్రయాణాల్లో రైలు ప్రయాణం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. లాంగ్ జర్నీ చేయాలి అంటే చాలు.. ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటారు. అంతేకాదు.. ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లాలన్నా.. రైలు ఎక్కుతాం. అసలు.. మన దేశంలో రైలు ప్రయాణం అంటేనే లాంగ్ జర్నీ, గంటల కొద్దీ ముచ్చట్లు, బోగీల్లో తినుబండారాలే గుర్తుకు వస్తాయి. కొన్ని రైలు ప్రయాణాలు అయితే రోజుల పాటు సాగుతాయి. కానీ, మనం సరిగ్గా ట్రైన్ లో కూర్చొనే లేపే దిగాల్సిన స్టేషన్ వస్తే..? ఒక పాట వినేలోగా రైలు దిగాల్సి వస్తే..? ఇలాంటి వింత ప్రయాణం మన దేశంలో కూడా ఉంది. కేవలం 3 కిలోమీటర్ల దూరం, 7 నిమిషాల సమయంలో ముగిసే రైలు ప్రయాణం సాగుతుంది.

23
మన దేశంలోనే అతి చిన్న రైలు ప్రయాణం ఎక్కడంటే...

ఈ అతి చిన్న రైలు ప్రయాణం మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఉంది. నాగ్ పూర్ జంక్షన్ నుంచి అజ్నీ వరకు సాగుతుంది. ఈ రైలు ప్రయాణం కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే సాగుతుంది. సాధారణంగా 7 నుంచి 9 నిమిషాలు మాత్రమే ఈ రైలు ప్రయాణిస్తుంది. 1853లో ప్రారంభమైన భారతదేశపు మొదటి ప్రయాణికుల రైలు బొంబాయి నుంచి థానే వరకు 34 కిలో మీటర్లు సాగింది. అప్పట్లో ఇదే అతి చిన్న ప్రయాణం అనుకునేవారు. కానీ, నాగ్ పూర్- అజ్నీ రూట్ అంతకంటే 10 రెట్లు చిన్నదిగా రికార్డు సృష్టించింది.

33
కేవలం 3 కిలోమీటర్ల కే రైలు ఎవరు ఎక్కుతున్నారు..?

కేవలం 3 కిలో మీటర్ల దూరం కోసం అసలు ఎవరు రైలు ఎక్కుతారు అనుకోవచ్చు. కానీ, అక్కడ నివసించే వేలాది మంది ప్రతిరోజూ ఈ రైలు ఎక్కుతూనే ఉంటారు. నాగ్ పూర్ నగరంలో ఉద్యోగాలు, కాలేజీలు, ఇతర వ్యాపారాల కోసం వెళ్లేవారు ఈ రైలు ప్రయాణం చేస్తూనే ఉంటారు. రోడ్డు ప్రయాణం చాలా రద్దీగా ఉంటుందని, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని.. ఈ రైలు ప్రయాణాన్ని వారు ఎంచుకుంటారు. కేవలం 7 నిమిషాల్లో తమ డెస్టినేషన్ చేరుకుంటామని.. వీరు ఈ రైలు ఎక్కుతూ ఉంటారు.

ఈ రైలు ప్రయాణం టికెట్ ధర ఎంతంటే...

ఈ అత్యంత తక్కువ రైలు ప్రయాణం టికెట్ ధరలు వింటే మాత్రం షాక్ అయిపోతారు. ప్రయాణం చిన్నగా ఉన్నా.. టికెట్ ధర మాత్రం ఎక్కువగానే ఉంటుంది.

జనరల్ క్లాస్: ₹60

స్లీపర్ క్లాస్: ₹145 నుండి ₹175 వరకు

AC 3-టైర్: ₹555

AC 2-టైర్: ₹760

AC 1st క్లాస్: ₹1,255

అంటే... కేవలం 7 నిమిషాల ప్రయాణానికి రూ.1255 ఖర్చు పెట్టేవారు కూడా ఉన్నారు అని అర్థం. లాంగ్ జర్నీలకు మారుపేరుగా మన భారత రైల్వేలో.. ఈ అత్యంత షార్ట్ జర్నీ కూడా ఉండటం విశేషం.

Read more Photos on
click me!

Recommended Stories