దుమ్ము, ధూళి, కాలుష్యం, పెరిగిన ఒత్తిడి, మారిన లైఫ్స్టైల్ వల్ల చాలామంది ముఖంపై కాంతి తగ్గిపోతుంది. దీనికోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్, ట్రీట్మెంట్లు వాడతారు. నిజానికి కేవలం బొప్పాయి పండుతో ముఖాన్ని మెరిపించుకోవచ్చు. బొప్పాయిలో చర్మానికి అవసరమైన విటమిన్ ఎ, సి, పపైన్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటాయి. అందుకే బొప్పాయి ఫేస్ప్యాక్ను వారానికి మూడు నుంచి నాలుగు సార్లు వాడొచ్చు.
బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడంలో సాయపడుతుంది. అలాగే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మంలో కొల్లాజెన్ను పెంచుతాయి. దీనివల్ల చర్మం మరింత మృదువుగా, తాజాగా మారుతుంది. మొటిమల మచ్చలు, ట్యానింగ్ తగ్గడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది.