మహిళలు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా... అయితే ఆహారంలో ఇవి తప్పనిసరి?

Published : Nov 09, 2022, 03:23 PM IST

సాధారణంగా మహిళలు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుంటారు. మహిళలు యుక్త వయసుకు వచ్చే సమయానికి పెళ్లి జరగడం పిల్లల్ని కనీ అనంతరం నెల నెల ఋతుక్రమం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక వయసు పైబడిన తర్వాత మోనోపాజ్ దశలో కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.ఈ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా వారి శరీరానికి ఎన్నో పోషకాలు అవసరం. మరి ఆ పోషకాలు ఏవి అనే విషయానికి వస్తే...  

PREV
15
మహిళలు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా... అయితే ఆహారంలో ఇవి తప్పనిసరి?

ఐరన్:
మహిళలు నెల నెల రుతుక్రమ సమస్యతో బాధపడుతూ అధిక రక్తస్రావం కారణంగా ఎంతోమంది రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. ఇలా రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎక్కువగా ఐరన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఐరన్ మనకు క్యాప్సిల్స్ రూపంలో కూడా లభిస్తుంది. కానీ మనం ఐరన్ ఎక్కువగా కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఈ రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఐరన్ ఎక్కువగా నట్స్, పాలకూర చీజ్, చికెన్, సి ఫుడ్ వంటి ఆహార పదార్థాలలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

25

విటమిన్లు: 

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే వారి శరీరానికి విటమిన్లు కూడా ఎంతో అవసరం విటమిన్లలో ముఖ్యంగా బి విటమిన్ ఎంతో కీలకంగా ఉంటుంది.ఇక గర్భం దాల్చిన మహిళలు ఎక్కువగా విటమిన్ లో కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వారి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. ఇకపోతే విటమిన్లు ఎక్కువగా చేపలు, గుడ్లు, పాలు ఆల్ చిప్పలు ముఖ్యంగా సాల్మన్ చేపలలో ఎక్కువగా విటమిన్లు లభ్యమవుతాయి.

35

కాల్షియం:
మన శరీరంలో ఎముకల దృఢత్వానికి గుండె పనితీరుకు కండరాల ఆరోగ్యానికి కాల్షియం ఎంతో అవసరం అవుతుంది. ఎప్పుడైతే క్యాల్షియం లోపిస్తుందో ఆ సమయంలో గుండె జబ్బుల బారిన పడటం లేదా శరీరంలో ఎముకలు పట్టుత్వాన్ని కోల్పోయి తొందరగా పెలుసు బారడం జరుగుతుంది. అందుకే క్యాల్షియం ఎక్కువగా కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. కాల్షియం ఎక్కువగా పాలు, బెండకాయ, చీజ్ ,చికెన్, చేపలు, పాలకూర వంటి ఆహార పదార్థాలలో అధికంగా లభిస్తుంది.
 

45

మెగ్నీషియం:గర్భం దాల్చిన మహిళలు తప్పనిసరిగా మెగ్నీషియం అధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల నాడులో కండరాల పనితీరు మెరుగుపడుతుంది. డయాబెటిస్వంటి సమస్యలతో బాధపడే వారికి డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. అయితే మెగ్నీషియం ఎక్కువగా అవకాడో పాలకూర గుమ్మడికాయ విత్తనాలు డాకు చాక్లెట్స్ వంటి వాటిలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది.
 

55

ఈ విధంగా మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఈ విధమైనటువంటి పోషకాలు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలాంటి పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మహిళలలో ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నివారించవచ్చు.ఇక ఈ మూలకాలన్నీ కూడా మనకు క్యాప్సిల్స్ రూపంలో దొరికినప్పటికీ వీటిని ఆహార పదార్థాలలో తీసుకుంటేనే శరీరానికి పుష్కలంగా లభిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories