తెలుగు రాష్ట్రాల్లో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా కేసులు నమోదవుతున్నాయి. దీంతో దోమలను తరిమికొట్టేందుకు కాయిల్స్, స్ప్రేలు వాడతారు కానీ వాటిలోని కెమికల్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందుకే సహజమైన పదార్థాలతో దోమలను దూరం చేసుకోవడం మంచిది. ఇంటిని తుడిచే నీటిలో కొన్ని సహజ పదార్థాలు కలిపేస్తే దోమలు దగ్గరకి కూడా రావు.