సంప్రదాయ వైద్యంలో పసుపు పాలకు చాలా ప్రాధాన్యం ఉంది. వీటిని 20 రోజుల పాటు క్రమం తప్పకుండా తాగితే చాలా లాభాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా పసుపులో ఉండే కర్క్యూమిన్, శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. పాలల్లో పసుపును కలిపి తీసుకుంటే కర్క్యూమిన్ శరీరానికి మెరుగ్గా అందుతుంది. 20 రోజులపాటు పసుపు పాలు తాగడం వల్ల తరచూ వచ్చే జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పుల సమయంలో పసుపు పాలు ఒక ఔషధంలా పనిచేస్తాయని సూచిస్తున్నారు.