జామకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ ఈ పొటాషియాన్ని ఎక్కువగా తీసుకుంటే మాత్రం కిడ్నీ సమస్యలు మరింత పెరుగుతాయని కిడ్నీ ఫౌండేషన్ తెలుపుతోంది. అందుకే మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు జామకాయల్ని ఎక్కువగా తినకూడదు.
జామకాయను ఎలా తినాలి?
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజుకు ఒకే జామకాయను తినాలి. అలాగే బాగా పండిన జామకాయనే తినాలి. ఇది పొట్టకు మేలు చేస్తుంది. అయితే ఓట్స్ లేదా పెరుగుతో జామకాయను తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే ఈ జామకాయకు బదులుగా మీరు బొప్పాయి పండును తింటే మంచిది. దీనిలో ఫైబర్, విటమిన్ సిలు కూడా మెండుగా ఉంటాయి.