1.వాత దోషం, కీళ్ల నొప్పులు ఉన్నవారు..
వాత దోషం ఉన్న వారికి గ్యాస్, కడుపు ఉబ్బరం, కీళ్ల నొప్పులు, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు మజ్జిగను మరీ పల్చగా తాగకూడదు. కొంచెం చిక్కగా మజ్జిగ తాగాలి. అందులో కచ్చితంగా ఉప్పు కలుపుకోవాలి. దీనితో పాటు.. వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోవాలి. అంతేకాదు.. వీరు ఫ్రిజ్ లో పెట్టిన చల్లటి మజ్జిగ తాగకూడదు. రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడే తాగాలి.
2.పిత్త దోషం ఉన్నవారు.. ( వేడి, ఎసిడిటీ)..
శరీరంలో వేడి ఎక్కువగా ఉండి, తరచుగా ఎసిడిటీ, కడుపులో మంటతో బాధపడేవారికి పిత్త దోషం ఉన్నట్లు అర్థం. వీరు మజ్జిగను చాలా పల్చగా చేసుకోని తాగాలి. ఇందులో ఉప్పు లేదా కారం మసాలాలు లాంటివి వేయకూడదు. కావాలంటే రుచి కోసం.. పంచదార, పటిక బెల్లం కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకుంటే వేడి సమస్య తగ్గుతుంది. అయితే.. వీరు పుల్లటి మజ్జిగ మాత్రం అస్సలు తాగకూడదు