ఈ పద్ధతి పాలకూర, మెంతికూర, లెట్ట్యూస్ వంటి ఆకు కూరలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, దోసకాయ, వంకాయ, క్యాప్సికమ్ వంటి గట్టి తొక్క ఉన్నవాటికి ఉపయోగపడతాయి.
ఇందులో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే...ఉప్పు నీరు కేవలం ఉపరితల అవశేషాలను మాత్రమే తగ్గిస్తుంది. లోపలికి చొచ్చుకుపోయిన పురుగుమందులను పూర్తిగా తొలగించదు. బయట పొర తొలగించడం, పై ఆకులు తీసేయాలి. ఎక్కువసేపు నానబెట్టకూడదు. ముఖ్యంగా మృదువైన ఆకు కూరలు పాడైపోతాయి. ఉప్పు నీటిలో నానబెట్టిన తర్వాత నేరుగా వండకూడదు. తప్పనిసరిగా మళ్లీ కడగాలి.
కొద్దిగా ఉప్పు, శుభ్రమైన నీరు, ఇంకా కొన్ని నిమిషాల సమయం అంతే. ఈ చిన్న అలవాటు ద్వారా మన రోజువారీ కూరగాయలను మరింత శుభ్రంగా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా తాజాగా ఉంటుంది.