బల్లులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాయి. మరుగుదొడ్లు వంటి అపరిశుభ్రమైన ప్రదేశాలలో కూడా కనిపిస్తాయి. వాటి పాదాలు, చర్మంపై కంటికి కనిపించని అనేక సూక్ష్మక్రిములను కలిగి ఉంటాయి. బల్లి ఆహారంలోకి ప్రవేశించినప్పుడు, ఈ క్రిములు ఆహారంలో కలిసిపోతాయి మరియు ఆహారం చెడిపోతుంది. ఈ విషయం తెలియకుండా ఆహారం తీసుకోవడం వల్ల వాంతులు, స్పృహ తప్పడం వంటివి జరుగుతుంటాయి. దానిని పుడ్ పాయిజన్ గా పరిగణిస్తుంటారు. అందుకే బల్లులతో కాస్త జాగ్రత్తగా ఉండండి.