Idli Dosa batter: ఎండాకాలం పిండి పులిసిపోతోందా? పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు, ఫ్రెష్ గా ఉంటుంది

Published : May 15, 2026, 06:03 PM IST

Idli Dosa batter: ఎండాకాలంలో దోశ పిండి, ఇడ్లీ పిండి వెంటనే పులిసిపోతుంది. దీని వల్ల వాటి రుచి కూడా మారిపోతుంది. అలా కాకుండా… పిండి రుబ్బుకునేటప్పుడు ఒక చిన్న ట్రిక్ ఫాలో అయితే… వారమైనా పిండి తాజాగా ఉంటుంది.  

PREV
13
ఇడ్లీ, దోశ పిండి...

ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ అంటే.. మన అందరికీ ముందు గుర్తుకు వచ్చేది ఇడ్లీ, దోశ.  వీటిని తయారు చేయడానికి మనం ఇంట్లోనే పిండిని రుబ్బుకుంటూ ఉంటాం. అయితే.. ఈ ఎండాకాలంలో దోశ, ఇడ్లీ పిండి తొందరగా పులిసిపోతుంది. అలా పులిసిపోతే రుచి పాడైపోతుంది.  అయితే… అలాకాకుండా… ఎక్కువ రోజులు పిండి పాడవ్వకుండా తాజాగా ఉండాలంటే… కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు… వారం పది రోజులైనా పిండి ఫ్రెష్ గా ఉంటుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

23
పిండి రుబ్బుకునేటప్పుడు...

మిక్సీలో పిండి రుబ్బుతున్నప్పుడు గ్రైండర్ వేడెక్కుతుంది. ఈ వేడికి పిండి కూడా తొందరగా వేడిగా మారుతుంది. ఆ వేడి వల్ల పిండి తొందరగా పులిసిపోతుంది. అందుకే.. పిండి రుబ్బేే సమయంలో.. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి రుబ్బుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి మళ్లీ చల్లగా మారుతుంది.  ఇలా చేయడం వల్ల పిండి తొందరగా పులవదు. తాజాగా ఉంటుంది. ఎండాకాలంలో ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది.

పిండి చల్లగా ఉన్నప్పుడే మినపప్పు బాగా ఉబ్బుతుంది.  అప్పుడే ఇడ్లీలు మెత్తగా మల్లెపువ్వులా వస్తాయి. ఇక.. దోశలు కూడా మీకు నచ్చినట్లు గా క్రిస్పీగా వస్తాయి. 

33
పిండి తొందరగా పులవదు

పిండి వేడెక్కితే దాని రుచి మారిపోతుంది, తొందరగా పులిసిపోయే ప్రమాదం ఉంది. ఐస్ క్యూబ్స్ వాడటం వల్ల పిండి అసలు రుచి, తెలుపు రంగు అస్సలు మారకుండా ఉంటాయి. పిండి రుబ్బేటప్పుడే వేడెక్కితే, అప్పుడే పులియడం (ఫర్మెంటేషన్) మొదలవుతుంది. దీనివల్ల పిండి సరిగ్గా పొంగదు. అదే ఐస్ క్యూబ్స్ వేస్తే, పిండి నెమ్మదిగా పులిసి, చక్కగా పొంగుతుంది.

చల్లటి నీళ్లు లేదా ఐస్ క్యూబ్స్ వేసి రుబ్బితే బియ్యం, పప్పులు తొందరగా మెత్తగా నలుగుతాయి. ఐస్ క్యూబ్స్ నీటిని అందిస్తూ, పిండి కన్సిస్టెన్సీని కాపాడతాయి. ఈ చిట్కా వాడితే.. ఎండాకాలంలో మీకు పిండి పులిచే సమస్య ఉండదు.

Read more Photos on
click me!

Recommended Stories