పచ్చడికి కావాల్సిన మసాలాలు వేయించాలి. ఒక చిన్న పాన్లో జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని కొద్దిగా రంగు మారేంత వరకు వేయించి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేయాలి. ఇదే పచ్చడికి మెయిన్.పైన మరిగిన చికెన్ను కొద్దిగా చల్లార్చి చేతితో తుంచి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 250 గ్రాముల నూనె వేసి, దానిలో ఈ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తక్కువ మంటపై వేయించాలి. ఈ సమయంలో రెండు రెమ్మల కరివేపాకు వేసి మరింత సువాసన రానివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి జల్లుగా వేయించాలి.