వీటితో అస్సలు తీసుకోకూడదు..
* మటన్ తిన్నవెంటనే ఎట్టి పరిస్థితుల్లో ఆలుగడ్డ తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రెండింటిని ఒకేసారి తీసుకుంటే అజీర్తి, వికారం, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలకు దారి తీస్తుంది.
* మనలో చాలా మంది మటన్ తింటూ కూల్డ్రింక్స్ వంటివి తాగుతుంటారు. అయితే ఇది అస్సలు మంచిది కాదని అంటున్నారు. అలాగే పండ్ల రసాలు కూడా తాగకూడదు. పండ్ల రసాలు తీసుకుంటే గ్యాస్ సమస్యలు ఎక్కువ అవుతాయని నిపుణులు అంటున్నారు.
* మటన్ తినగానే పాలు అస్సలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఒక్క మటన్ మాత్రమే కాకుండా ఏ నాన్ వెజ్ తిన్న తర్వాత అయినా పాలు తాగకూడదు. దీనివల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.