చేప ముక్కలు – ½ కిలో, ఉల్లిపాయలు – 2, టమాటాలు – 2, పచ్చిమిర్చి – 3, చింతపండు – చిన్న నిమ్మకాయ సైజులో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్, కారం – 1½ టేబుల్ స్పూన్లు, పసుపు – ½ టీస్పూన్, ధనియాల పొడి – 1 టీస్పూన్, జీలకర్ర పొడి – ½ టీస్పూన్, మెంతుల పొడి – చిటికెడు, ఉప్పు – తగినంత, నూనె – 4 టేబుల్ స్పూన్లు, కరివేపాకు – 2 రెమ్మలు, కొత్తిమీర – కొద్దిగా
చేపలను ముందుగా ఇలా సిద్ధం చేసుకోవాలి
చేప ముక్కలను శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా పోయేలా ఉంచాలి. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చేపలకు రుచి బాగా పడుతుంది, వాసన కూడా తగ్గుతుంది.