ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ మొత్తం 8 రాత్రులు, 9 రోజుల పాటు సాగుతుంది. ఈ ప్రయాణం జూలై 20వ తేదీన ప్రారంభం అవుతుంది. ఈ టూరిస్ట్ రైలులో మొత్తం 702 సీట్లు ఉన్నాయి. ఇందులో స్లీపర్ క్లాస్ కింద 160 సీట్లు, థర్డ్ ఏసీ కింద 490 సీట్లు, సెకండ్ ఏసీ కింద 52 సీట్లు కేటాయించారు. ఈ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు బోర్డింగ్, డీబోర్డింగ్ చాలా ఆప్షన్లు ఇచ్చారు. సికింద్రాబాద్, చార్లపల్లి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ప్రయాణికులు ఈ రైలు ఎక్కవచ్చు లేదా దిగవచ్చు.