కానీ సమంత ప్రవర్తన కొన్నాళ్ళుగా అగ్రేసీవ్ గా మారింది. ఎప్పుడూ సీరియస్ మూడ్ లో ఉంటున్న ఆమె, దురుసుగా ప్రవర్తిస్తున్నారు.
ఆ మధ్య ఓ ప్రముఖ జాతీయమీడియా సమంతపై వస్తున్న రూమర్స్ కి స్పష్టత కోరుతూ పలుమార్లు సంప్రదించ ప్రయటించగా... కనీసం స్పందించకుండా సదరు రిపోర్టర్ ని అవాయిడ్ చేశారట.
తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సమంతను, ఓ రిపోర్టర్ రూమర్స్ పై స్పందించాలని కోరారు. దీనికి ఆమె అగ్గిమీద గుగ్గిళం అయ్యారు. గుడికి వస్తే ఇలాంటి ప్రశ్నలా... బుద్ది ఉందా అంటూ ఫైర్ అయ్యారు.
సమంతకు ఈ విషయం గురించి మాట్లాడడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉంటే సరిపోతుంది. అలా కాకుండా బుద్ది ఉందా అంటూ, రిపోర్టర్ పై మండిపడడం హాట్ టాపిల్ అయ్యింది.
సమంత వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నారని ఆమె ప్రవర్తన, సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా అర్థం అవుతుంది. ఆ సమస్య ఏమిటనేది తెలియాల్సిన ఉంది.
ఇక నాగ చైతన్యతో సమంతకు విబేధాలు తలెత్తగా... ఇద్దరు విడివిడిగా ఉంటున్నారని, చివరకు విడాకులు తీసుకోవడానికి సిద్ధం అయ్యారనేది, ప్రచారం అవుతున్న కథనం. అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంత మౌనం వహిస్తున్న నేపథ్యంలో సస్పెన్సు కొనసాగుతుంది.