Ennenno Janmala Bandham: వేదను క్షమించమని అడిగిన యష్.. కోపంతో రగిలిపోతున్న అభిమన్యు?

First Published Dec 8, 2022, 1:08 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు డిసెంబర్ 8వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో వేద ఒకటికి పది సార్లు ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మీరు అనుమతి ఇస్తే నేను ఈ కేసు వాపస్ తీసుకోవాలి అనుకుంటున్నాను అనడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు లాయర్ ఝాన్సీ వేద ఏం జరిగింది అని అనగా అందరూ నన్ను క్షమించండి. ఎందుకు, ఏమిటి,ఎలా ఇలాంటి ప్రశ్నలు ఏవి అని ప్రశ్నించకండి అని చేతులు జోడించి ఎమోషనల్ గా మాట్లాడుతుంది వేద. మరొకవైపు అభిమన్యు మందు తాగుతూ ఉండగా ఇంతలో కైలాష్ అక్కడికి వచ్చి చాలు బ్రో మరీ ఎక్కువ తాగేస్తున్నావు అని అనగా ఎంత తాగినా ఎక్కడం లేదు అని అంటాడు అభిమన్యు.
 

 అయిన ఆదిత్య మీద అవకాశం దొరికితే లోపలికి వేయించకుండా అలా చేసింది ఏంటి బ్రో అని కైలాష్ అడగగా అదే ఆడదానికి మగానికి ఉన్న తేడా అని అంటాడు అభిమన్యు. ఆదిత్య అంటే యష్ గాడికి చాలా ప్రాణం. అది తిను వదిలేస్తే మొగుడు దృష్టిలో దేవత అయిపోతుంది మాళవిక మీద పగ కూడా తీర్చుకున్నట్టు అవుతుంది అనడంతో ఆ వేదకు ఇన్ని తెలివితేటలు ఎక్కడివి బ్రో అని అంటాడు కైలాష్. మరికొవైపు అందరూ ఇంట్లో ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మాలిని చాలా పెద్ద తప్పు చేసినావ్ వేద, భర్త మనసు నొప్పించకుండా ఉండడం కోసం రాజీ పడ్డావా అని అంటుంది. ఆ మాళవికకు శిక్ష పడకుండా చేశావు అంతే మేము నమ్మలేకపోతున్నాం వేద అని అంటాడు వేద తండ్రి.
 

అప్పుడు మాలిని సులోచన తో మాట్లాడుతూ నీ కూతురు చాలా పెద్ద తప్పు చేసి ఉండాది అని అనగా వెంటనే వేద అవును నేను  చేసింది తప్పే అని అంటుంది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను అని సులోచన కాలా దగ్గర కూర్చొని మీకోసం ఈ కేసు తరపున పోరాడుతానని చెప్పి ఈ మాట తప్పాను అని అంటుంది వేద. మీ ఎవరితో చెప్పకుండా ఈ కేసు రిటర్న్ చేసుకోవడానికి కారణం ఒక పది ఏళ్ల పసివాడు అని అనగా యష్ అవుతాడు. మీరు అనుకుంటున్నట్లుగా యాక్సిడెంట్ చేసింది మాళవిక కాదు ఆదిత్య అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

అందుకే నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను అని అంటుంది వేద. అప్పుడు  అందరూ ఒక్కసారిగా ఆలోచనలో పడతారు. నేను ఆదిత్య యశోదర్ కొడుకు అని నేను ఈ పని చేయలేదు దానికి కారణం ఒకటి ఉంది అమ్మ అని బాధగా మాట్లాడుతుంది వేద. తల్లి అవ్వలేని నాకు ఆ దేవుడు ప్రతి ఒక బిడ్డను తల్లిగా భావించే గొప్ప మనసును ఇచ్చాడు అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది వేద. అప్పుడు సులోచన నా కూతురిని చూసి నేను గర్వపడుతున్నాను అని అంటుంది. అప్పుడు మాలిని కూడా వేదని పొగుడుతూ ఉంటుంది. 
 

కానీ నేను ఎవరినైతే నేను నమ్మాను వాళ్ళు నన్ను నమ్మలేదు వాళ్ళ బిడ్డలు నేను కన్న బిడ్డ లాగా చూసుకుంటాను అన్న మాట మర్చిపోయారు అని బాధగా మాట్లాడుతుంది వేద. నా భర్త నాలో అమ్మతనాన్ని అర్థం చేసుకోలేకపోయారు ఆ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను అంటూ ఎమోషనల్ అవుతుంది వేద. అప్పుడు యష్ ముందుకు వచ్చి అమ్మానాన్న మీ అందరిని నేను క్షమించమని అడిగా అర్హత కూడా కోల్పోయాను అని చేతులు జోడించి క్షమించమని అడుగుతాడు. మరొకవైపు మాళవిక ఆదిత్యతో ఈ కేసు కొట్టేశారు అని చెప్పడంతో ఆదిత్య సంతోషపడుతూ ఉంటాడు. మరొకవైపు లాయర్ ఝాన్సీ ఎదురుచూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి వేద వస్తుంది.
 

అప్పుడు రా జడ్జి వేద అనగా నేను జడ్జిని కాదు అనడంతో నేను ఎన్నో కేసులు చూశాను. కానీ ఏ జడ్జ్ ఇవ్వని తీర్పుని నువ్వు ఇచ్చావు అంటూ వేదని పొగుడుతూ ఉంటుంది ఝాన్సీ. అప్పుడు వారిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు సులోచన మాలిని ఇద్దరు గుడిలో గంట కొట్టడానికి ఇద్దరు ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడికి పంతులుగారు రావడంతో వారిద్దరు పోట్లాడుకుంటూ పంతులు గారికి పిచ్చెక్కించేలా మాట్లాడుతారు..

click me!