ఎన్నాళ్లుగానో మదిలో దాగున్న కోరిక బయటపెట్టిన త్రిష.. సూపర్‌ స్టార్‌పై మనసు.. నయా లుక్‌లో అందాలు మైండ్‌ బ్లాక్‌

First Published Jan 2, 2023, 5:56 PM IST

త్రిష ఇటీవల `పొన్నియిన్‌ సెల్వన్‌`తో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. తాజాగా ఈ బ్యూటీ తన మనసులో దాచుకున్న కోరిక బయటపెట్టింది.
 

త్రిష (Trisha) కృష్ణన్‌.. తరగని అందం ఆమె సొంతం. నాలుగు పదుల వయసులోనూ టీనేజ్‌ అమ్మాయిలా కనిపిస్తుంది. క్యూట్‌ లుక్స్‌ మాత్రం ఏమాత్రం చెదరలేదు. ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన `వర్షం`, `అతడు` వంటి సినిమాల్లో ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. ఇంకా చెప్పాలంటే త్రిష అందం మరింత పెరిగింది. ఇప్పుడిప్పుడే దూసుకొస్తున్న యంగ్‌ హీరోయిన్లకి పోటీనిచ్చేలా ఉంది. 
 

ఇటీవల త్రిష `పొన్నియిన్‌ సెల్వన్‌` అనే సినిమాతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ఇందులో `కుందవై` అనే రాణి పాత్రలో నటించింది. హీరో విక్రమ్‌కి చెల్లిగా నటించడం విశేషం. అందానికి అందం, ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సినిమాలో అలరించింది. ఆమె అందాన్ని చూడ్డానికి రెండు కళ్లు చాలవనేలా ఉండటం విశేషం. దీంతో మరోసారి తెలుగు, తమిళంలో త్రిష పేరు బాగా మోగుతోంది. చాలా కాలంగా ఒకటి రెండు సినిమాల్లో పెద్దగా నోటెడ్‌ లేని చిత్రాల్లో మెరిసిన త్రిషకి పాన్‌ ఇండియా రేంజ్‌ సినిమా పడటంతో ఆమె క్రేజ్‌ లేచి వచ్చిందనేట్టుగా మారిపోయింది. 
 

త్రిష లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు కూడా చేస్తుంది. తమిళంలో ఆమె చేసిన `రాంగి` చిత్రం డిసెంబర్‌ 30న విడుదలైంది. సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. కానీ ఇందులో బోల్డ్ గా ఉన్న జర్నలిస్ట్ పాత్రలో త్రిష నటించింది. ఆమె నటనకు మంచి పేరు వస్తుంది. యాక్షన్‌ సన్నివేశాల్లో ఆమె నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్న నేపథ్యంలో ఆ ఆనందాన్ని పంచుకుంటూ మీడియాతో ముచ్చటించింది. 

ఇందులో ఇన్నాళ్లు తన మనసులో దాగున్న కోరికని బయటపెట్టింది త్రిష. తాను ఇప్పటికే తమిళంలో, తెలుగులో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించిన నేపథ్యంలో తాను నటించని ఓ సూపర్‌ స్టార్‌ పై మనసు పడింది. ఆయనతో కలిసి సినిమా చేయాలనే కోరిక మనసులో చాలా రోజులుగా ఉందట. అది ఎవరో కాదు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth). కోలీవుడ్‌ నాట కమల్‌తోపాటు అజిత్‌, విజయ్‌ ఇలా యంగ్‌ హీరోలతోనూ నటించింది త్రిష. కానీ ఇప్పటి వరకు రజనీతో జోడీ కట్టలేదు. అందుకే ఆయనకు జోడీగా పూర్తి స్థాయి పాత్రలో నటించాలని ఉందని మనసులోని కోరికని విప్పేసింది. మరి ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో చూడాలి. 
 

త్రిష ఇంకా చెబుతూ, `పొన్నియిన్‌ సెల్వన్‌` గురించి, మణిరత్నం గురించి, గౌతమ్‌ మీనన్‌, శరవణన్‌,ప్రేమ్‌ వంటి దర్శకులను పొగిడేసింది. వారితో సినిమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పింది. `పీఎస్‌1`లోని కుందవై పాత్రలో నటించిన నేపథ్యంలో ఇప్పటికీ తనని కుందవైగానూ చూస్తున్నారని తెలిపింది. ఈ చిత్రంలో పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కావడంతో తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని చెప్పింది. మరోవైపు ఇప్పుడు `పొన్నియిన్‌ సెల్వన్‌ 2` సినిమా రిలీజ్‌ డేట్‌ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 28న విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం త్రిష `పీఎస్‌2`తోపాటు `సతురంగ వెట్టై 2`, `రామ్‌ ః పార్ట్ 1`, `ది రోడ్‌` చిత్రాలు చేస్తుంది. 
 

click me!