టాలీవుడ్ దోస్తీ.. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్లే..

First Published Aug 7, 2022, 4:06 PM IST

ఆగస్టు నెల మొదటి ఆదివారం ప్రత్యేక ఏంటో అందరికీ తెలిసిందే. కష్టాల్లో, నష్టాల్లో, బాధలో,  సంతోషంలో వెన్నంటే ఉండే వ్యక్తి స్నేహితుడు. నమ్మితే ప్రాణాలైనా ఇచ్చే వాడే దోస్తు. అలాంటి దోస్తుల దినోత్సవం సందర్భంగా.. టాలీవుడ్ లోని స్టార్స్ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం.
 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) - దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మైత్రీ గురించి తెలిసిందే. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ చిత్రం నుంచి ప్రారంభమైన వీరిద్దరి దోస్తీ.. ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఒక ఏజ్ గ్రూప్ కాకపోయినా.. వీరిద్దరూ తమ వ్యక్తిగత విషయాలను ఒకరితో మరొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. కొన్ని ప్రత్యేక రోజుల్లోనూ వీరిద్దరూ తరుచూ కలుస్తూనే ఉంటారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా  వీరి మైత్రీని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
 

ఇండస్ట్రీలోని మరో దోస్తీ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - రానా. వీరిద్దరూ వెండితెరకు పరిచయం కాకముందు నుంచే ఎంతో మంచి స్నేహితులు. ఒకరంటే మరొకరికి ఎంతో గౌరవం. ఇండస్ట్రీలో వీరి ఫ్రెండ్ షిప్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే.  వీరిద్దరూ తమ ప్రాథమిక విద్యాబ్యాసాన్ని ఒకే స్కూల్ లో కలిసి పూర్తి చేశారు. ఇప్పటికీ వీరు పలు ఈవెంట్లు, పార్టీలకు వెళ్తుంటూనే ఉంటారు. ప్రత్యేకమైన రోజుల్లో స్పెషల్ గా కలుస్తుంటారు. 
 

రెబల్  స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ప్రమోట్ అయిన డార్లింగ్  ప్రభాస్ (Prabhas)కు చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఆయన్ని ఇష్టపడని వారంటు ఉండరు. అయితే ఇండస్ట్రీలో మాత్రం ప్రభాస్ ఇష్టపడే దోస్తు  హీరో గోపీచంద్ (Gopichand). ఇప్పటికే ప్రభాస్,  గోపీచంద్ కు సంబంధించిన  ఆయా సినిమా ఈవెంట్లకు హాజరైన విషయం తెలిసిందే. స్వయంగా ప్రభాసే గోపీచంద్ తన బెస్ట్ ఫ్రెండ్ అనిి చెప్పిన విషయం తెలిసిందే. వీరి ఇద్దరి మైత్రీ కూడా అభిమానులకు, ఆడియెన్స్ కు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కు రానా బెస్ట్ ఫ్రెండ్ కాగా..  అంతే మైత్రీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉంది. వీరిద్దరూ మంచి స్నేహితులనే విషయం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’తో బహిర్గతమైంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో వీరిద్దరూ ఎలా కలిసిఉంటారో.. పుట్టిన రోజులను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెలియజేశారు. రామ్ చరణ్ కు బాగా అర్థం చేసుకున్న వారిలో ఎన్టీఆర్ ఒకరని చెర్రీ కూడా తెలిపారు. 
 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత దగ్గరగా ఉంటారో తెలిసిందే. వీరిద్దరి  మైత్రీకి ఇండస్ట్రీనే ఫిదా అవుతోంది. పవన్ కళ్యాణ్ తీసుకునే కీలక నిర్ణయాల్లోనూ త్రివిక్రమ్ సలహాలు, సూచనలు చేస్తుంటారంట. అలాగే స్పెషల్ డేల్ లో వీరు ప్రత్యేకంగా కలిసి సమయం గడుపుతుంటారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘జల్సా’,‘భీమ్లా నాయక్’ చిత్రాలంటే అభిమానులకు ఎంతగానో ఇష్టం.
 

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు ఇండస్ట్రీలో చాలా దగ్గరి ఫ్రెండ్ నవీన్ పొలిశెట్టి. వీరిద్దరి కేరీర్ ఒకేసారి మొదలైంది. ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్’ చిత్రంలో గోల్డ్ ఫేజ్ యూత్ గా వెండితెరపై మెరిశారు. అలాగే వీరు థియేటర్ ఆర్ట్స్ లోనూ కలిసి నాటకాలు వేశారంట. వీరి మైత్రీకి కూడా అభిమానులు ఫిదా అవుతుంటారు. నవీన్ పొలిశెట్టి సినిమా ఫంక్షన్లకు విజయ్ హాజరై వారిద్దరి మైత్రీ గురించి పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. నవీన్ కూడా ఎమోషనల్ అయిన సందర్భాలున్నాయి.
 

ఐకాన్ స్టార్ అల్లు అర్జన్ (Allu Arjun)కు ఇండస్ట్రీలో బాగా దగ్గరైన వ్యక్తి  క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. వీరి మధ్య మైత్రీ కొన్నేండ్లుగా కొనసాగుతోంది. ఇండస్ట్రీ వరకే పరిమితమైన ఈ విషయాన్ని ఇటీవల అల్లు అర్జున్ ‘ఢీ13’లో వెల్లడించారు.  బన్నీ తన పర్సనల్ విషయాలను కేవలం దర్శకుడు సుకుమార్ తోనే షేర్ చేసుకుంటారంట. వీరిద్దరూ పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్తారని, ఖాళీ సమయంలో అల్లు అర్జున్ సుకుమార్ తో సమయం గడిపేందుకు ఇష్టపడుతుంటారంట. 

click me!