భర్తకు విడాకులిస్తానన్న రంభ, నచ్చచెప్పి కాపురాన్ని నిలబెట్టిన తెలుగు స్టార్ డైరెక్టర్

First Published Aug 14, 2022, 11:44 AM IST

తెలుగు తెరను ఒప్పుడు ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో రంభ కూడా  ఒకరు.  ఆ ఒక్కటి అడక్కు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది ఈ సీనియర్ బ్యూటీ.  విజయవాడకు చెందిన ఈ హీరోయిన్ అసలు పేరు విజయలక్ష్మి. అయితే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమె పేరును రంభగా మార్చేశారు. 

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే అదృష్టం కలిసి వచ్చింది రంభకు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేస్తూ వచ్చింది. సినిమాల్లోకి వచ్చిరాగానే మెగాస్టార్ చిరంజీవి ,నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోల సరసన కూడా నటించి మెప్పించింది రంభ. చాలా తక్కువ టైమ్ లోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ నుపొందింది. 

దాదాపు   దశాబ్ధం పాటు తెలుగు తెరపై అప్సరసలా.. ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రంభ. తన అందచందాలతో ఒక ఊపు ఊపేసింది. ఇక చిన్నగా అవకాశాలు తగ్గిపోడంతో .. సినిమాలకు దూరమయ్యింది రంభ. ఆతరువాత  కెనడాలో ఉంటున్న ప్రముఖ ఇండియన్ వ్యాపారవేత్త ఇంద్ర కుమార్ ను లవ్వాడి 2010  లో పెళ్ళి చేసుకుంది. 

చాలా ఏళ్లగా  అన్యోయ్యంగా ఉంటూ వస్తోన్న ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు కూడా. అయితే కొన్నాళ్లకు వీరి మధ్య కొన్ని మనస్పర్థలు కూడా వచ్చాయట..తన భర్తకు విడాకులిస్తానంటూ.. రంభ కూడా పంతానికి పోయిందట. దాంతో వీరిద్దరు  పరస్పర అంగీకారంతో ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు. 
 

అంతే కాదు పిల్లల పోషణతో పాటు ఇతర ఖర్చులకు తనకు నెలకు  ఐదు లక్షల రూపాయలు భరణంగా  ఇవ్వాలని కూడా రంభ తన పిటీషన్ లో పేర్కొంది. ఇక అదే సమయంలో రంభ‌తో బోంబాయి ప్రియుడు లాంటి హిట్ సినిమాలు చేసిన..  టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్  కే రాఘవేంద్రరావు ఆమెతో మాట్లాడి మళ్ళీ భార్యాభర్తలను కలిపారట. 

అంతే కాదు రభకు రాఘవేంద్రుడు హితబోద చేసినట్టు తెలుస్తోంది. భర్తకు దూరమైతే  సమాజంలో ఎలాంటిఇబ్బందుల వస్తాయి. అని చెప్పడంతో పిల్లల పోషణకు ఎలాంటిసమస్యలు వస్తాయో చెప్పడంతో .. ఆమె మెత్తపడిందట. అంతే కాదు  చిన్నచిన్న విభేదాలకు పంతాలకు పోకూడదని రాఘవేంద్రరావు చేసిన సూచనలతో రంభ తిరిగి భర్తతో కాపురం చేసేందుకు ఒప్పుకుందట. 

అలా తన కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇండియా నుంచి ఇమిడియట్ గా కెనెడా వెళ్ళిపోయిందట బ్యూటీ.  అలా తిరిగి ఆమె కెనడా వెళ్లి ఇప్పుడు తన ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇక రంభ‌ ఇప్పుడు తిరిగి టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు వార్తలు సోషల్ మీడియాతో పాటు.. బయటక కూడా గుప్పుమంటున్నాయి. 

 ఇక  రంభ‌ టాలీవుడ్ తో పాటు తమిళం, హిందీలోను లోనూ మంచి అవకాశాలు పొందింది.  ముఖ్యంగా  రంభ భోజపురి భాషలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే.. భోజపురి ఆడియన్స్ కు ఆమె ఒక దేవతలా మారిపోయింది. ఆ భాషలో రంభ ఒక వెలుగు వెలిగింది. మనోజ్ తివారి –రంభ కాంబినేషన్  అప్పట్లో సూపర్ హిట్ అయినట్టే..? 

click me!