మిల్కీ బ్యూటీ తమన్నా.. శృతి హాసన్‌ ఫస్ట్ టైమ్‌ కలిశారట.. ఏం చేశారంటే?

First Published Jan 3, 2021, 12:52 PM IST

టాలీవుడ్‌ మిల్కీ బ్యూటీ తమన్నా, శృతి హాసన్‌ ఫస్ట్ టైమ్‌ కలిశారు. అవును వీరిద్దరు కొత్త ఏడాదిలోకి వచ్చాక మొదటి సారి కలుసుకున్నారట. తనకు ఇష్టమైన వ్యక్తిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొంది శృతి హాసన్‌. ఈ సందర్భంగా వీరిద్దరు కలిసి దిగిన ఫోటోని పంచుకున్నారు. 
 

న్యూ ఇయర్‌ 2021 సందర్భంగా సెలబ్రిటీలు గోవా, మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేశారు. అందుకు ముందుగానే అక్కడికి వెళ్ళి సెలబ్రేషన్‌లో పాల్గొన్నారు. కానీ తమన్నా, శృతి హాసన్‌ మాత్రం ఇంటికే పరిమితమయ్యారు.
undefined
తమన్నాకి ఆ మధ్య కరోనా సోకింది. దీంతో ఈ సారి సెలబ్రేషన్స్ కి దూరంగా ఉన్నారు. ఇక శృతి హాసన్‌ కూడా సెలబ్రేషన్‌కి దూరంగా ఉన్నారు.
undefined
తాజాగా వీరిద్దరు న్యూ ఇయర్‌ స్టార్ట్ అయ్యాక కలుసుకుని సెలబ్రేట్‌ చేసుకున్నారు. తమ ఆనందాన్ని పంచుకున్నారు. కొంటెగా పోజులిచ్చారు. తెగ అల్లరిచేసినట్టు తెలుస్తుంది.
undefined
ఈ సందర్భంగా తమ ఫోటోని ఇరువురు ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. శృతి హాసన్‌ స్పందిస్తూ, న్యూ ఇయర్‌ 2021 సందర్భంగా ఫస్ట్ రోజు నాకిష్టమైన, లవ్లీ తమన్నాని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉందని తెలిపింది. తమన్నా కూడా శృతి పోస్ట్ ని తన ఖాతాలో పేర్కొంది.
undefined
తమన్నా ప్రస్తుతం `ఎఫ్‌3`, `సీటీమార్‌`, `గుర్తుందా శీతాకాలం` చిత్రాల్లో నటిస్తుంది. ఇటీవల ఈ చిత్రాల షూటింగ్‌ల కోసం మొన్నటి వరకు హైదరాబాద్‌లోనే ఉంది తమన్నా.
undefined
దీంతోపాటు నితిన్‌తో కలిసి `అంధాధున్‌` రీమేక్‌లో నటిస్తుంది. ఇందులో తమన్నాది నెగటివ్‌ రోల్‌ కావడం విశేషం.
undefined
అలాగే శృతి హాసన్‌ రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తూ తెలుగులో `క్రాక్‌`, పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌ సాబ్‌` చిత్రాల్లో నటిస్తుంది. న్యూ ఇయర్‌ సందర్భంగా `వకీల్‌ సాబ్‌`లోని పవన్‌తో ఉన్న కొత్త లుక్‌ని విడుదల చేశారు. ఇది బాగా ఆకట్టుకుంది.
undefined
మరోవైపు శృతి రెగ్యూలర్‌గా బ్లాక్‌ టీషర్ట్ లో కొంటెగా పోజులిస్తూ ఫోటోలు దిగింది. వీటిని అభిమానులతో పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది.
undefined
తమ హృదయం సైలెన్స్ నుంచి ఎక్స్ ప్లోజన్‌ కోరుకుంటుందని పేర్కొంది. మ్యాడ్‌, మూడీ, మ్యాజిక్‌ ఈ మూడు తనకి థ్రెట్‌ అని పేర్కొంది శృతి.
undefined
బ్లాక్ డ్రెస్‌లో శృతి ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.
undefined
click me!