Ennenno Janmala Bandham: "వేద, యష్"ల పెళ్లికి ఒప్పుకోని సులోచన, మాలిని.. ఖుషిని టార్చర్ చేస్తున్న అభిమన్యు!

First Published Jan 28, 2022, 2:02 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం (Ennenno Janmala Bandham) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతుంది. రేటింగ్ లో కూడా ఈ సీరియల్ ముందు స్థానంలోనే దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

వేద, యష్ (Vedha, Yash) వాళ్లు ఇంట్లో తమ కుటుంబ సభ్యుల ముందు తమ పెళ్లిల గురించి మాట్లాడుతారు. ఇక వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావని అడిగేసరికి వేద యష్ పేరు చెబుతుంది. యష్ వేద పేరు చెబుతాడు. దీంతో సులోచన (Sulochana), మాలిని షాక్ అయ్యి కోపంతో రగిలిపోతారు.
 

ఇక రత్నం, వరదరాజులు (Varadharajulu) ఆ మాట విని తెగ సంతోష పడుతుంటారు. కానీ మాలిని, సులోచన మాత్రం  వద్దంటే వద్దని తమ మాటలతో బాధపపెతారు. సులోచన (Sulochana) వేద తో పెళ్లి చేసుకున్న వాడిని చేసుకోవద్దని పట్టు పడుతుంది. మరోవైపు మాలిని కూడా వేదను తన కోడలుగా స్వీకరించడానికి అస్సలు ఒప్పుకోదు.
 

ఇక మాలిని (Maalini), సులోచన మళ్ళీ గొడవ పడటానికి బయటికి వస్తారు. ఇక ఇద్దరు తమ మాటలతో బాగా రెచ్చి పోతూ ఉంటారు. గొడవ మొత్తం సద్దుమణిగి ఇంట్లోకి వెళ్లాక.. వేద, యష్ (Yash) బయటకు వచ్చి పెద్దలకు నచ్చని పెళ్లి మనం చేసుకోవడం కరెక్టు కాదు అని అనుకుంటారు.
 

వారు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందాము అని మాట తీసుకుంటారు. మరోవైపు రత్నం (Ratnam).. మాలిని పై కోపంతో అరుస్తాడు. ఇప్పటి వరకు యష్ కు మంచి అమ్మాయిని తీసుకురాగలిగావా అని ప్రశ్నిస్తాడు. పెళ్లి చేసుకున్న అబ్బాయికి పైగా ఒక కూతురు ఉన్న అతడిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు రారు అని.. కానీ వేద (Vedha) మాత్రం ముందుకు వచ్చిందని అంటాడు.
 

ఇక వరదరాజులు కూడా సులోచన తో కోపం గానే మాట్లాడుతాడు. పిల్లలు పుట్టని మన కూతురికి దేవుడు ఖుషి ని (Khushi) దగ్గర చేసాడని.. కానీ నువ్వు ఆ బంధాన్ని  దూరం చేస్తున్నావు అంటూ ఆమెపై అరుస్తాడు. యష్ కూడా చాలా మంచి వ్యక్తి అని అంటాడు. ఇక వేద (Vedha) పెళ్లికి ఒప్పుకునే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని అంటాడు. మరి వీరి పెళ్లి కాకుంటే ఖుషి పరిస్థితి ఎలా ఉంటుందో మరి.

click me!