అవార్డు వచ్చిన ఆనందంలో హాట్‌ పోజులతో హీటెక్కిస్తున్న శివాత్మిక రాజశేఖర్‌.. ఊపులో `దొరసాని`

First Published Sep 18, 2021, 4:48 PM IST

స్టార్‌ కిడ్‌ శివాత్మిక రాజశేఖర్‌ గ్లామర్‌ సైడ్‌ తానేంటో నిరూపించుకుంటూ వస్తోంది. క్రమ క్రమంగా డోసు పెంచుతూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. అయితే ఇప్పుడు అవార్డు వచ్చిన ఆనందంలో అంతే హాట్‌గా మెరిసిపోతుంది శివాత్మిక. 

రాజశేఖర్‌, జీవితల చిన్న కూతురు శివాత్మిక. రాజశేఖర్‌ తనయగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అక్క శివానీ తెరంగేట్రం ముందు జరిగినా, ఆమె కంటే ముందే తాను ఆడియెన్స్ ముందుకొచ్చింది. `దొరసాని` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయం అయ్యింది. 
 

విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండతో కలిసి నటించిన `దొరసాని` చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ప్రశంసలందుకుంది. ముఖ్యంగా శివాత్మిక సెటిల్డ్ నటన అందరిని కట్టిపడేసింది. తొలి చిత్రమైనా చాలా బాగా చేసిందనే ప్రశంసలందుకుంది. 
 

తాజాగా ఈ చిత్రానికిగానూ అవార్డుని అందుకుంది శివాత్మిక. ఉత్తమ నటిగా `సాక్షి ఎక్స్ లెంట్‌` అవార్డుని సొంతం చేసుకుంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఈవెంట్‌లో శివాత్మిక ఈ అవార్డుని సొంతం చేస్తుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది శివాత్మిక. `దేవకి` పాత్రకి అవార్డు ఇచ్చిన సాక్షికి ధన్యవాదాలు తెలిపింది. 

ఇంత వరకు బాగానే ఉంది. కానీ శివాత్మిక అవార్డుతో ఇచ్చిన పోజులు ఆడియెన్స్ మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. హాట్‌ పోజులో హీటుపెంచేస్తుంది శివాత్మిక. అవార్డు వచ్చిన ఆనందంలో ఇలాంటి పోజులివ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 

శివాత్మిక `దొరసాని` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయమైంది. రాజశేఖర్‌ తనయగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ఓ సెపరేట్‌ గుర్తింపుని తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఓ వైపు నటనతో, మరోవైపు గ్లామర్‌తో తానేంటో చూపిస్తుంది. హాట్‌ ఫోటో షూట్‌లతో సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 

ప్రస్తుతం శివాత్మిక `పంచతంత్రం` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `రంగమార్తాండ` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. 

వీటితోపాటు తమిళంలోనూ రెండు సినిమాలకు కమిట్‌ అయ్యింది శివాత్మిక. ప్రముఖ హీరోలతో కలిసి నటిస్తుంది. ఏక కాలంలో తెలుగు, తమిళంలో హీరోయిన్‌గా రాణించేందుకు ప్రయత్నిస్తుంది. 

click me!