భార్యకి సారీ చెప్పి అషురెడ్డికి ప్రపోజ్ చేసిన రోహిత్.. బిగ్ బాస్ హౌస్ లో అరియనా, ఇతర మాజీల రచ్చ

First Published Dec 17, 2022, 10:39 PM IST

బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు షో చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం రోజు గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని అందించింది.

బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు షో చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం రోజు గ్రాండ్ ఫినాలే జరగబోతోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని అందించింది. రేపు జరగబోయే ఫినాలేలో విన్నర్ ఎవరో తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఉన్నారు. 

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్, కీర్తి, రోహిత్ టాప్ 5 గా నిలిచారు. ఈ ఐదుగురిలో విన్నర్ ఎవరో రేపు తేలనుంది. ఫినాలేకి ముందు శనివారం రోజు హౌస్ మేట్స్ హౌస్ లో ఎంతో సంతోషంగా గడిపారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా హౌస్ లోకి ప్రవేశించి ఎంటర్టైన్ చేశారు. 

ముందుగా హౌస్ లోకి రోల్ రైడా ఎంటర్ అయ్యాడు. తానా హుషారైన ర్యాప్ తో అదరగొట్టాడు. టాప్ 5 కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరిని ప్రశంసించాడు. రోల్ రైడాతో పాటు రేవంత్ కూడా పాటలు పాడి ఎంటర్టైన్ చేశారు. అనంతరం సోషల్ మీడియా గ్లామర్ బాంబ్ అషురెడ్డి ఎంట్రీ ఇచ్చింది. రాను రానంటూనే చిన్నదో అనే సాంగ్ తో అషురెడ్డికి స్వాగతం పలికారు. 

అషురెడ్డితో పాటు మెహబూబ్ కూడా వచ్చాడు. వీరిద్దరూ హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడించడం, డ్యాన్స్ చేయడం చేసారు. అషురెడ్డి, మెహబూబ్ 'సిలకలూరి సింతామణి ' ఐటెం సాంగ్ కి డ్యాన్స్ చేసి హుషారెత్తించారు. బిగ్ బాస్ హౌస్ లో కూడా అషురెడ్డి తన గ్లామర్ తో విజువల్ ట్రీట్ ఇచ్చింది. బ్లూ మినీ డ్రెస్ లో అషురెడ్డి మెరుపులు మెరిపించింది. 

అషురెడ్డి హౌస్ మేట్స్ తో కొన్ని గేమ్స్ ఆడించింది. అందులో భాగంగా రోహిత్ తనని ఇంప్రెస్ చేయాలని టాస్క్ ఇచ్చింది. రోహిత్.. అషురెడ్డిని ఫ్లట్ చేస్తూ.. మీ స్మైల్ బావుంది, హెయిర్ స్టయిల్ బావుంది అంటూ ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. చివరకి మీరు నాతో డిన్నర్ డేట్ కి వస్తారా అని అడిగేశాడు. కెమెరా వైపు చూస్తూ తన భార్య మెరీనాకి సారీ చెప్పాడు. 

అనంతరం అరియనా, అవినాష్ ఎంట్రీ ఇచ్చారు. అరియనా బ్లాక్ డ్రెస్ లో హాట్ లుక్ లో హౌస్ లోకి వచ్చింది. అవినాష్ తన ఫన్నీ చేష్టలతో నవ్వించాడు. అరియనా, అవినాష్ ఇద్దరూ రచ్చ చేస్తూ మంచి వినోదం పంచారు. అలాగే ఆర్జే కాజల్, భానుశ్రీ, రవికృష్ణ కూడా బాగ్ బాస్ హౌస్ లోకి మరోసారి ఎంట్రీ ఇచ్చారు. టాప్ 5 కంటెస్టెంట్స్ తో సరదాగా ముచ్చటించి వెళ్లారు. ఆ తర్వాత టాప్ 5 కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. 

click me!