`ఫీమేల్‌ మల్టీస్టారర్‌`కి తెరలేపిన ప్రియాంక చోప్రా.. అలియాభట్‌, క్రతినాకైఫ్‌లతో క్రేజీ మూవీ.. నెవర్‌ బిఫోర్‌

First Published Aug 11, 2021, 10:40 AM IST

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా రెండేళ్ల గ్యాప్‌తో మరో బాలీవుడ్‌ సినిమా చేయబోతుంది. అయితే ఈ సారి ఆమె ఫీమేల్‌ మల్టీస్టారర్‌కి తెరలేపడం విశేషం. `ఆర్‌ఆర్‌ఆర్‌`భామ అలియాభట్‌, కత్రినా కైఫ్‌లతో ఓ బిగ్‌ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది. 

మంగళవారం బాలీవుడ్‌లో చేయబోతున్న కొత్త  సినిమాన ప్రకటించింది ప్రియాంక చోప్రా. అలియాభట్‌, కత్రినాలతో కలిసి ఈ సినిమా చేయబోతుందట. దీన్ని ఆమె `ఫీమేల్‌ మల్టీస్టారర్‌`గా వర్ణించడం విశేషం. ఈ రకంగా ఈ పదంలో ఓ కొత్త ట్రెండ్‌కి తెరలేపిందనే చెప్పాలి. 
 

`జీ లే జారా` పేరుతో ఈ సినిమా రూపొందుతుందని, నటుడు, సింగర్‌, దర్శకుడు, నిర్మాత ఫర్హాన్‌ అక్తర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. కొంత గ్యాప్‌తో ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

ఈ సినిమా అనౌన్స్ మెంట్‌ పూర్తయిన కాసేపటికి ఇటు ప్రియాంక, అలియాభట్‌, కత్రినా కైఫ్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటోని పంచుకున్నారు. ఇందులో తమ సందేశాలను, తమ ఫీలింగ్స్ ని పంచుకున్నారు. 

ప్రియాంక చోప్రా చెబుతూ, 2019లోనే తాను మరో బాలీవుడ్‌ సినిమా చేయాలనుకుందట. అయితే ఈ సారి అది చాలా భిన్నంగా ఉండాలని, బాగుండాలని, గతంలో ఎప్పుడూ టచ్‌ చేయని సబ్జెక్ట్ అయి ఉండాలని, అది హీరోయిన్లతో కూడినదై ఉండాలని, అలాంటి సినిమా కోసం వేచి చూస్తున్నట్టు చెప్పింది. 
 

దీనికి ప్రియాంక `ఫీమేల్‌ మల్టీస్టారర్‌` అనే పేరు పెట్టింది. మన వద్ద లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు తగినన్ని రావడం లేదని, ముగ్గురు ఆస్‌స్క్రీన్‌ గర్ల్ ఫ్రెండ్స్ కలిసి చేస్తే బాగుంటుందని, అందుకు తన రియల్‌ లైఫ్‌ ఫ్రెండ్స్ అయితే బాగుంటుందని అనుకుందట. 

2020 ఫిబ్రవరిలో తాను, కత్రినా, అలియా కలుసుకున్నారట. ప్రపంచం మొత్తం ఆగిపోవడానికి(లాక్‌డౌన్‌)కి ముందు ఈ కథా చర్చలు జరిపినట్టు తెలిపింది. ఫర్హాన్‌, రితేష్‌, జోయా, రీమా కలిసి దీనిపై నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఇది రోడ్‌ జర్నీ మూవీ అని చెప్పింది. ఇక షూటింగ్‌ ప్రారంభించబడమే మిగిలి ఉందని పేర్కొంది.
 

ఒక డ్రీమ్‌ కోసం రెండేళ్ల క్రితం ముగ్గురు అమ్మాయి కలిశారని, అదే ఈ సినిమా అని, తమ డ్రీమ్‌ నెరవేరబోతుందని అలియాభట్‌ తెలిపింది.  ప్రస్తుతం అలియా తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్న విషయం తెలిసిందే. హిందీలో `గంగూభాయి కథియవాడి`తోపాటు హిందీలో `బ్రహ్మాస్త్ర`, `డార్లింగ్‌` చిత్రాల్లో నటిస్తు

కత్రినా కైఫ్‌ స్పందిస్తూ `అతను నా మృదయాన్ని నవ్వించేలా చేశాడు. నేను అమ్మాయిలను ప్రేమిస్తాను. ఒకరికొకరం కలిసి ఉండటం వల్ల ఎల్లప్పుడు సరదాగా ఉంటుంది. గొప్ప స్క్రిప్ట్, అద్బుతమైన దర్శకుడు, ఇదొక రోడ్‌ ట్రిప్‌ మూవీ` అని పేర్కొంది. ఇక ప్రస్తుతం కత్రినా `సూర్యవంశీ`, `ఫోన్‌ బూత్‌`, `టైగర్‌ 3` చిత్రాల్లో నటిస్తుంది.
 

click me!