ఎన్టీఆర్(NTR) చివరగా నటించిన `ఆర్ఆర్ఆర్` విడుదలై ఆరు నెలలు పైనే అవుతుంది. ఇప్పటికే నెక్ట్స్ సినిమా ప్రారంభం కాలేదు. తారక్.. కొరటాల శివతో తన30వ(NTR30) సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇది చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ కొరటాల రూపొందించిన `ఆచార్య` పరాజయం చెందడంతో ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పై మరింత కసరత్తులు చేస్తున్నారు.
దీంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఆలస్యమవుతుంది. ఎప్పుడో ఐదారు నెలల క్రితం ప్రారంభం అవుతుందన్నారు. చివరగా ఆగస్ట్ లో అన్నారు. ఇప్పుడు అక్టోబర్ వచ్చింది. దసరా కూడా అయిపోయింది. ఇంకా ఈ సినిమా ప్రారంభం కాలేదు. ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అభిమానులంతా ఊపిరి బిగపట్టుకుని, ఆవేదన, అసహనం, కోపాన్ని పళ్లకింద బిగబట్టుకుని వేచి చూస్తున్నారు.
ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ రాబోతుందట. అక్టోబర్ 10న షూటింగ్ కి సంబంధించి అప్డేట్ రానుందని సమాచారం. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సినిమా ప్రారంభం కానుందా? లేక ప్రారంభానికి సంబంధించిన ప్రకటన కానుందా? అనేది సస్పెన్స్ నెలకొంది. ఆల్మోస్ట్ షూటింగ్ అప్డేట్ రానుందనే నమ్మకంతో ఉన్నారు తారక్ ఫ్యాన్స్.
మరోవైపు హీరోయిన్ కూడా కన్ఫమ్ అనే టాక్ మొదలైంది. నిజానికి ఇందులో నటించేందుకు ఏ హీరోయిన్ ఒప్పుకోవడం లేదని టాక్. జాన్వీ కపూర్. దీపికా పదుకొనె, కీర్తిసురేష్, సమంత, రష్మిక మందన్నా పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక (Rashmika Mandanna) కన్పమ్ అయ్యిందని సమాచారం.
`పుష్ప` చిత్రంతో శ్రీవల్లిగా మెప్పించిన రష్మిక మందన్నా.. పాన్ ఇండియా ఇమేజ్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ జోరుమీదుంది. తెలుగు, తమిళం, హిందీ సినిమాలు చేస్తుంది రష్మిక. క్షణం తీరికలేకుండా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు ఎన్టీఆర్కి ఓకే చెప్పిందని సమాచారం.
తాజాగా ఓ ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్న రష్మిక.. ఎన్టీఆర్ 30లో మీరు ఫైనల్ అయ్యారని తెలుస్తుందని విలేకరి ప్రశ్నించగా, అన్నీ మీరే అనుకోండి, మీరే ఫైనల్ చేయండి అంటూ నవ్వుతూ చెప్పింది. ఎగ్జైటెడ్గా ఉన్నారా? అని అడగ్గా `ఎగ్జైటింగ్గా ఉన్నా` అంటూ హింట్ ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్ 30లో హీరోయిన్గా తాను ఎంపికైనట్టే అనే విషయాన్ని పరోక్షంగా కన్ఫమ్ చేసింది రష్మిక మందన్నా.
రష్మిక హిందీలో నటించిన `గుడ్బై` చిత్రం ఈ రోజు శుక్రవారం విడుదలైంది. అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుంది. మరోవైపు సినిమా రిలీజ్ అవడంతో ఇన్నాళ్లు బిజీగా గడిపిన ఈ భామ రిలాక్స్ కాబోతుంది. మాల్డీవులకు వెకేషన్కి చెక్కేసింది. అయితే విజయ్ దేవరకొండ కూడా అదే సమయంలో మాల్దీవులకు వెల్లడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ ఇద్దరు డేటింగ్లో ఉన్నారనే రూమర్స్ వినిపించిన నేపథ్యంలో ఇప్పుడీ ఇద్దరు ఒకేసారి వెకేషన్కి వెళ్లడం, అది కూడా మాల్దీవులకే కావడం విశేషం.