శృతి హాసన్ లిప్ కిస్సులు, జగ్గూభాయ్ బోల్డ్ డైలాగ్స్...లవ్, సెక్స్ అండ్ ఎమోషన్స్ ప్రధానంగా పిట్ట కథలు ట్రైలర్!

First Published Feb 5, 2021, 12:06 PM IST

నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ యాంథాలజీ సిరీస్ గా విడుదలైన లస్ట్ స్టోరీస్ సక్సెస్ నేపథ్యంలో తెలుగులో తెరకెక్కింది పిట్టకథలు. శృతి హాసన్, అమలా పాల్, జగపతి బాబు, సత్యదేవ్ లాంటి టాప్ స్టార్స్ నటించడంతో ఈ సిరీస్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. 

ప్రేమ, ద్రోహం, మోసం వంటి అంశాలు ప్రధానంగా నాలుగు విభిన్నమైన ప్రేమకథలు నేపథ్యంలో ఈ యాంథాలజీ సిరీస్ తెరకెక్కింది. తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, నాగ్ అశ్విన్ మరియు నందినిరెడ్డి నాలుగు కథలకు దర్శకత్వం వహించారు.
undefined
నేడు పిట్టకథలు ట్రైలర్ విడుదల కాగా... లవ్, సెక్స్  అండ్ ఎమోషనల్ అంశాలను బోల్డ్ గా చర్చించినట్లు అర్థం అవుతుంది. శృతిహాసన్, సంజిత్ హెగ్డే ల ప్రేమ కథ ఈ జనరేషన్ కథలా లేదు. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ తో తెరక్కినట్లు అనిపిస్తుంది.
undefined
ట్రైలర్ లో ఆకట్టుకున్న మరో అంశం జగపతి బాబు, అమలాపాల్ పై తెరకెక్కిన కథ. అనుమానపు భర్త, చీటింగ్ వైఫ్ గా వీరిద్దరి మధ్య సంఘర్షణ ట్రైలర్ లో ప్రముఖంగా చూపించారు. 'నీకు ఎంత మంది మొగుళ్లే, అని జగపతి బాబు చెప్పిన డైలాగ్ బోల్డ్ గా ఉంది.
undefined
శాన్వీ మేఘన, నవీన్ కుమార్ లవ్ స్టోరీ పేద యువ జంట మధ్య నడిచే ప్యూర్ లవ్ స్టోరీగా కనిపిస్తుంది. ఈ కథలో పొలిటీషియన్ అయిన మంచు లక్ష్మీ పాత్రేంటి అనేది ఆసక్తి రేపుతోంది.
undefined
ఈషా రెబ్బా మరో కథలో కీలకంగా కనిపించారు. ప్రేమ, సెక్స్ అండ్ ఎమోషన్స్ వంటి సున్నితమైన అంశాలను చర్చిస్తూ, బోల్డ్ కంటెంట్ తో పిట్టకథలు తెరకెక్కించారని ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. శృతి హాసన్ , అమలా పాల్, అషిమా నర్వాల్ ఘాటు లిప్ కిస్ సన్నివేశాలలో,  తెగించి నటించినట్లు తెలుస్తుంది.
undefined
మొత్తంగా పిట్టకథలు యాంథాలజీ సిరీస్ ట్రైలర్ ఆకట్టుకోవడంతో పాటు, అంచనాలు పెంచేసింది. ఫిబ్రవరి 19నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.
undefined
undefined
click me!