లెహంగా చోలిలో కియారా అద్వానీ క్లీవేజ్‌ అందాల విందు.. సిద్ధార్థ్‌తో ఎఫైర్‌ వైరల్‌

First Published Aug 8, 2021, 9:16 AM IST

రామ్‌చరణ్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ మరోసారి తెలుగులోకి కమ్‌ బ్యాక్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న క్లీవేజ్‌ అందాల ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చూపు తిప్పుకోనివ్వడం లేదు. 
 

కియారా అద్వారా బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. `అర్జున్‌రెడ్డి` రీమేక్‌ `కబీర్‌సింగ్‌` చిత్రంతో విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు క్రేజీ సినిమాల్లో భాగమవుతూ వస్తోంది. 

తాజాగా ఆమె యంగ్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి `షేర్షా` చిత్రంలో నటించింది. ఈ సినిమా ఈ నెల 12న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతుంది. 

ఈ సందర్భంగా కియారా అద్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్రా చిత్ర ప్రమోషన్‌లో ఫుల్‌ బిజీగా గడుపుతున్నారు. వరుస ఫోటో షూట్లతో రెచ్చిపోతున్నారు. 

లేటెస్ట్ గా దిగిన ఓ ఫోటో షూట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో కియారా అద్వానీ క్లీవేజ్‌ షోతో మతిపోగొడుతుంది. 

మరోవైపు సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. వీరిద్దరు క్లోజ్డ్ ఇచ్చిన ఫోటో షూట్‌ పిక్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. అదే సమయంలో అనేక పుకార్లని క్రియేట్‌ చేస్తున్నాయి. 

సిద్ధార్థ్‌, కియారా ప్రేమలో ఉన్నట్టు గత కొన్నిరోజులుగా వార్తలొచ్చాయి. వీరిద్దరు పలు మార్లు ఎయిర్‌పోర్ట్ లోనూ కనిపించారు. వెకేషన్‌కి వెళ్తూ ఫోటోలకు చిక్కారు. 

మరోవైపు ఈ ఇద్దరు ఘాటు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పంచుకున్న ఫోటో షూట్లలో ఈ ఇద్దరు రెచ్చిపోయి పోజులివ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వీరి మధ్య లవ్‌ స్టోరీ నడుస్తుందనే విషయాన్ని కన్ఫమ్‌ చేసుకుంటున్నారు అభిమానులు.

అంతేకాదు ఇటీవల ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కియారా స్పందిస్తూ, సిద్ధార్థ్‌పై ప్రశంసలు కురిపించింది. ఆయనపై తనకున్న ప్రేమని చాటుకుంది. 

సిద్ధార్థ్‌ తనకు అత్యంత క్లోజ్‌ అని తెలిపింది. అదే సమయంలో తన జీవితంలో అతను చాలా స్పెషల్‌ అని పేర్కొంది. తన ప్రియుడు అనే మాట వాడలేదుగాని ఆల్మోస్ట్ అదే విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పింది కియారా. 

ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య లవ్‌ స్టోరీ వ్యవహారానికి సంబంధించిన వార్తలు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. ఎక్కడ చూసినా వీరి గురించిన చర్చే జరుగుతుంది. మరి దీనిపై వీరు ఎప్పుడు క్లారిటీ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. 

ఇక ప్రస్తుతం కియారా హిందీలో `భూల్‌ భులైయ్యా 2`,`జగ్‌ జుగ్‌ జీయో`, `మిస్టర్ లేలే` చిత్రాల్లో నటిస్తుంది. ఓ వైపు బాలీవుడ్‌లో బిజీగా ఉంటూనే తెలుగులో ఓ సినిమాకి సైన్‌ చేసింది కియారా. 

 `భరత్‌ అనే నేను`, `వినయ విధేయ రామ` తర్వాత మరోసారి తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో హీరోయిన్‌గా నటించబోతుంది. రామ్‌చరణ్‌తో ఆమెకిది రెండోసారి కావడం విశేషం.

click me!