హాట్ యాంకర్ అనసూయ టీవీ షోస్ కంటే సినిమాల ద్వారా బాగా వార్తల్లో నిలుస్తుంది. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయాలు సాధించడం, విడుదల సమయంలో విపరీతమైన హైప్ పెరగడం కూడా హాట్ టాపిక్గా మారడానికి కారణమని చెప్పొచ్చు.
అనసూయ ఇప్పటికే `కథనం`, `థ్యాంక్యూ బ్రదర్` చిత్రాల్లో మెయిన్ లీడ్ చేసింది. ఆమె పాత్ర ప్రధానంగా సాగే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. క్రేజీ యాంకర్స్ క్రేజ్ టీవీకే గానీ, సినిమాలకు వర్కౌట్ కాదనే కామెంట్లు వినిపించాయి. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా క్లిక్ అయిన వీళ్లు మెయిన్ లీడ్గా బుల్లితెర యాంకర్స్ క్లిక్ కావడం కష్టమనే కామెంట్లు వచ్చాయి.
అయినప్పటికీ తన పట్టుని విడువడం లేదు అనసూయ. తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా మరోసారి సాహసం చేస్తుంది అనసూయ. ఆమె మెయిన్ లీడ్గా ఓ సినిమా తెరకెక్కబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా సగం షూటింగ్ పూర్తయిందనే టాక్ కూడా వినిపిస్తుంది.
ఇటీవల `సీటీమార్` చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు సంపత్ నంది. ఆయన నిర్మాణంలో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. `పేపర్ బాయ్` చిత్రానికి దర్శకత్వం వహించిన జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయ్యిందట. ఇందులో అనసూయ మెయిన్ లీడ్ చేస్తుందని, తను ఎయిర్ హోస్టెస్గా మెరవనుందనే సమాచారం సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే అనసూయ `క్షణం`, `రంగస్థలం` చిత్రాల్లో బలమైన పాత్రలు పోషించి మెప్పించింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న `పుష్ప`లోనూ మరో బలమైన పాత్ర పోషిస్తుందట. ఇందులో సునీల్ సరసన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అనసూయ కనిపించనుందట.
దీంతోపాటు చిరంజీవి హీరోగా రూపొందుతున్న `ఆచార్య`లో కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. ఇందులో తన నటనకి ఫిదా అయిన చిరు మరో ఆఫర్ ఇచ్చారట అనసూయకి. తన నెక్ట్స్ `గాడ్ ఫాదర్`లో కీ రోల్కి అనసూయని ఎంపిక చేసినట్టు సమాచారం.
వీటితోపాటు `రంగమార్డాండ` చిత్రంలో, రవితేజ `ఖిలాడి`, `మహాసముద్రం`లోనూ కీలక పాత్రలు పోషిస్తుంది అనసూయ. `రంగమార్తాండ` చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని తీసుకున్నారట. ఇందులో దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ.
అనసూయ మారుతి, గోపీచంద్ `పక్కా కమర్షియల్`లో కూడా ఓ పాత్రలో మెరవనుంది. మమ్ముట్టి హీరోగా వస్తోన్న `భీష్మ పర్వం`లో అనసూయ కీలకపాత్రలో నటించనుంది. ఈ చిత్రంతో మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.
దీంతోపాటు తమిళంలో విజయ్ సేతుపతితో ఓ చిత్రం చేస్తుంది. ఇలా వరుసగా దాదాపు అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది అన్ను బేబీ. మరోవైపు `జబర్దస్త్` షోని ఇప్పటికీ తనదైన గ్లామర్తో, క్రేజ్తో, చలాకీతో రన్ చేస్తున్న విషయం తెలిసిందే.
`జబర్దస్త్` షోకి అనసూయ కేరాఫ్గా నిలుస్తుంది. కమెడీయన్ల పంచ్లకు, రోజా సెటైర్లకి తట్టుకుని తనదైన స్టయిల్లో వినోదాన్ని పంచుతుంది అనసూయ. ఇక ప్రతి వారం గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ సోషల్ మీడియా అభిమానులు మెస్మరైజ్ చేస్తుంది.