ఎగ్జామ్‌ రాయకుండానే టీచర్‌ జాబ్‌ కొట్టేసిన అనుపమా పరమేశ్వరన్‌.. లక్‌ అంటే ఆమెదే మరీ.. అసలు కథ ఇది!

First Published Jun 25, 2021, 2:58 PM IST

`ప్రేమమ్‌` బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ టీచర్‌ని ఎంపికైంది. `టెట్‌` పరీక్షల్లో మంచి మార్కులతో పాసై జాబ్‌ కొట్టేసింది. హీరోయిన్‌గా రాణిస్తున్న అనుపమాకి టీచర్‌గా చేయాల్సిన కర్మేంటి అనుకుంటున్నారా? అయితే ఈ కథ చూస్తే షాక్‌ అవ్వాల్సిందే.
 

మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్‌ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిలబడేందుకు ప్రయత్నిస్తుంది. పూర్తిగా సినిమాలపై ఫోకస్‌ పెట్టి కష్టపడుతుంది.
undefined
ఇంతలో ఈ అమ్మడికి టీచర్‌ జాబ్‌ వచ్చింది. అది కూడా బీహార్‌ లో కావడం విశేషం. 77శాతం మార్కులతో `టెట్‌`(టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్)లో పాసైంది. కానీ ఆమె పేరు మాత్రం మారిపోయింది. రిషికేశ్‌ పేరుతో ఆమె టెట్‌ పాస్ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఆమె ఎగ్జామ్‌ రాయకుండా పాస్ కావడం మరో విశేషం.
undefined
అసలు విషయానికి వస్తే.. తాజాగా బీహార్‌లో టెట్‌ ఫలితాలు వెల్లడించారు. అందులో రిషికేశ్‌ కుమార్‌ అనే వ్యక్తి 77 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. కానీ అతని స్కోర్‌ కార్డులో అతని ఫోటోకి బదులు అనుపమా పరమేశ్వరన్‌ ఫోటో ప్రింట్‌ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
undefined
నిజానికి రిషికేశ్‌ అడ్మిట్ కార్డుపై కూడా అనుప‌మ ఫొటో వ‌చ్చింది. అప్పుడత‌ను విద్యాశాఖాధికారుల‌ను సంప్ర‌దిస్తే, త‌ప్పును స‌రిచేస్తామ‌న్నారు. కానీ స‌రిచేయ‌లేదు. దాంతోనే రిషికేశ్ టెట్‌ ఎగ్జామ్‌ రాశాడు. తీరా ఫలితాలు వ‌చ్చిన త‌ర్వాత కూడా స్కోర్ కార్డుపై కూడా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఫొటోనే ఉండ‌టంతో షాకైన రిషికేశ్ వ్య‌వ‌హారాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్త వైర‌ల్ కావ‌డంతో విద్యాశాఖాధికారులు ద‌ర్యాప్తుకు ఆదేశించారు.
undefined
బీహార్‌ విద్యాశాఖలో గతంలోనూ ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకున్నాయి. జూనియర్‌ ఇంజనీర్‌ పరీక్షలో బాలీవుడ్‌ బ్యూటీ సన్నీలియోన్‌ను టాపర్‌గా ప్రకటించి నవ్వులపాలైన విషయం తెలిసిందే. ఇప్పుడు అనుపమా పరమేశ్వరన్‌ ఫోటోతో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. అక్కడి విద్యా వ్యవస్థలోని లోపాలను మరోసారి ఎత్తిచూపుతుంది.
undefined
దీనికి బీహార్‌ ప్రభుత్వం ఇచ్చిన షాక్‌కి అనుపమా ఎలా స్పందిస్తుందో చూడాలి. కానీ ఈ విషయాలో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం విశేషం. నెటిజన్లు బీహార్‌ విద్యా శాఖపై సెటైర్లు వేస్తున్నారు.
undefined
click me!