మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన అనుపమా పరమేశ్వరన్ `అ..ఆ` చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అందులో నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో మెరిసింది.
undefined
ఆ తర్వాత `శతమానం భవతి`, `ప్రేమమ్`, `ఉన్నది ఒక్కటే జిందగీ`, `రాక్షసుడు` చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో భాగమైన ఈ బ్యూటీ తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొంది. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు బాచుపల్లి లో మొక్కలు నాటింది.
undefined
ఆమె మాట్లాడుతూ, జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని హీరో నిఖిల్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటనని అనుపమ పరమేశ్వరన్ తెలిపింది.
undefined
అడవులు, పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపి సంతోష్ చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని తెలిపారు.
undefined
అనంతరం మరో ముగ్గురుకి సోషల్ వేదిక ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసురుతానని చేస్తానని తెలిపింది. ఈ కార్యక్రమంలో మమత హాస్పిటల్ ఎం.డి డా. పువ్వాడ నయన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
undefined