డబ్బుల కోసం మోడలింగ్‌ చేశా.. టిప్పు అడిగితే ముద్దు పెట్టిందన్న అక్కీ

First Published Sep 13, 2020, 7:47 AM IST

అక్షయ్‌ కుమార్‌కి థాయిలాండ్‌లో వెయిటర్‌గా పనిచేసే టైమ్‌లో చాలా స్వేచ్ఛగా ఉండేవాడట. ఇప్పుడు ఆ స్వేచ్ఛ లేదంటున్నారు. అంతేకాదు అప్పుడు ఓ మహిళ టిప్పుగా కిస్‌ పెట్టిందని గుర్తు చేసుకుని తెగసంబరపడుతున్నాడు అక్షయ్‌.
 

ఇటీవల ఆయన సాహస వీరుడు బేర్‌ గ్రిల్స్ తో కలిసి `ఇన్‌ టు ది వైల్డ్` షో కోసం సాహసాలు చేసిన విషయంతెలిసిందే. మన ఇండియాలో ప్రధాని మోడీ, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తర్వాత ఈ సాహసం చేసిన మూడో సెలబ్రిటీ అక్షయ్‌ కావడం విశేషం.
undefined
డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారమయ్యే ఓ ఎపిసోడ్‌ కోసం కర్నాటకలోని బందిపూర్‌ టైగర్‌ రిజర్వ్ లో షూటింగ్‌జరిపారు. ఈ సందర్భంగా అక్షయ్‌ తన గత గుర్తులను నెమరేసుకున్నారు. శుక్రవారం నుంచి ఈ షో ప్రసారమవుతుంది.
undefined
థాయిలాండ్‌లో వెయిటర్‌గా పనిచేసే రోజులను గుర్తు చేసుకుంటూ, ఆ టైమ్‌లో చాలా ఫ్రీడమ్‌ ఎక్కువట.ఇప్పుడు డబ్బున్నా, ఆ స్వేచ్ఛ లేదన్నాడు. ఆ జీవితమే వేరని, ఓ సారి ఓ మహిళ తనకు టిప్పుగా ముద్దు పెట్టిందన్నారు.
undefined
వెయిటర్‌ నుంచి మార్షల్‌ ఆర్ట్స్ టీచర్‌గా మారిన్నప్పుడు అనుకోకుండా మోడలింగ్‌లోకి అడుగుపెట్టానని, తనవద్ద శిక్షణ తీసుకుంటున్న ఓ స్టూడెంట్‌ వల్ల తండ్రి తనని మోడలింగ్‌కి వెళ్ళమని సూచించాడని, డబ్బుల కోసం మోడలింగ్‌ చేశానని, రెండు గంటల షూట్‌కి రూ.21వేలు రావడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.
undefined
అదొక అద్భుతమనిపించింది. దీంతో పూర్తిగా నటుడిగా మారిపోయానని అక్షయ్‌ గుర్తు చేసుకున్నారు. నెలంతాకష్టపడితే ఐదు వేలు వచ్చేవి. కానీ రెండు గంటల్లో అంతమొత్తం రావడం నిజంగా అద్భుతమనిపించిందన్నారు. ఒకప్పుడు డబ్బుల కోసం ఉద్యోగం చేసిన అక్షయ్‌ ఇప్పుడు అత్యధిక సంపాదనతో ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కినవిషయం తెలిసిందే. నిజంగానే ఆయనది స్ఫూర్తివంతమైన జీవితమనే చెప్పాలి.
undefined
ప్రతి ఏడాది మూడు నాలుగు సినిమాలతో ఆడియెన్స్ ముందుకొస్తూ అలరిస్తున్న అక్షయ్‌ ప్రస్తుతం`లక్ష్మీబాంబ్‌`, `సూర్యవంశీ`, `బచ్చన్‌ పాండే`, `పృథ్వీరాజ్‌`, `బెల్‌బాటమ్‌` వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇందులో `లక్ష్మీబాంబ్‌`ని ఓటీటీలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.
undefined
click me!