పవర్ప్లేలోనే 100 పరుగులు.. టీమిండియా రికార్డు
అభిషేక్ శర్మతో పాటు మరో ఓపెనర్ సంజూ శాంసన్ కూడా వేగంగా పరుగులు సాధించాడు. వీరిద్దరూ అఫ్గనిస్థాన్ బౌలర్లను ఎదుర్కొంటూ భారీ షాట్లు ఆడటంతో భారత జట్టు పవర్ప్లే ముగిసే సమయానికే వికెట్ నష్టపోకుండా 100 పరుగులు చేసింది. టీ20ల్లో భారత్కు ఇది అత్యధిక పవర్ప్లే స్కోరుగా నిలిచింది. అభిషేక్ దూకుడుకు సంజూ శాంసన్ ఆట కూడా తోడవడంతో పరుగుల వేగం మరింత పెరిగింది. తొలి ఆరు ఓవర్లలోనే స్కోరు వంద దాటడంతో అఫ్గనిస్థాన్ బౌలర్లపై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. ఆ తర్వాత కూడా భారత ఓపెనర్లు అదే దూకుడును కొనసాగించారు.
సంజూ శాంసన్ ధనాధన్ ఆట.. భారీ స్కోరు దిశగా భారత్
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మతో పాటు సంజూ శాంసన్ కూడా ఆకట్టుకున్నాడు. వేగంగా పరుగులు సాధిస్తూ టీ20 క్రికెట్లో 9,000 పరుగుల క్లబ్లో చోటు సంపాదించాడు. ఇద్దరు ఓపెనర్లు కలిసి అఫ్గనిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడటంతో భారత ఇన్నింగ్స్కు అదిరిపోయే ఆరంభం లభించింది.