వామ్మో! గోదావరి, కృష్ణా నదులు అంత పొడవుంటాయా

First Published Sep 13, 2024, 9:45 PM IST

ఇండియాలో 200కి పైగా నదులు ప్రవహిస్తున్నాయి. ఆ నదులపైనే ఆధారపడి కోట్ల మంది వ్యవసాయం, జీవనోపాధి పొందుతున్నారు. దేశంలోని  అత్యంత పొడవైన నదుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న నదులు అత్యంత పొడవైన నదుల జాబితాలో ఏ ప్లేస్ లో ఉన్నాయో తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు. ఇన్ని వేల కి.మీ. ఈ నదులు ప్రవహిస్తున్నాయా అంటూ షాక్ అవుతారు. 

నదులు, సంస్కృతి

విభిన్న భౌగోళిక స్వరూపాన్ని కలిగిన భారతదేశం విశాలమైన నదులకు నిలయం. ఈ నదులు చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. భారతీయుల జీవితాలు వాటిపైనే ఆధారపడి ఉన్నాయి. 200కి పైగా నదులు భారతదేశ విశాల భూభాగం ద్వారా ప్రవహిస్తున్నాయి. చాలా నదులు ఆరావళి, హిమాలయ పర్వత శ్రేణులలో పుట్టాయి. ఇండియాలో ప్రవహించే టాప్ 10 పొడవైన నదుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పవిత్ర గంగా నది

ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి నుండి పుట్టిన  గంగా భారతదేశంలోనే అతి పొడవైన నది. ఇది బెంగాల్ బేలో కలుస్తుంది. గంగా నది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. గంగా నది మొత్తం పొడవు సుమారు 2,525 కి.మీ.  దీన్ని బంగ్లాదేశ్‌లో పద్మ నది అని కూడా పిలుస్తారు. గంగా నది భారతదేశంలో అత్యంత పవిత్రమైన నదిగా గుర్తింపు పొందింది. 

గోదావరి: గంగా తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద నది గోదావరి. ఈ నది పొడవు దాదాపు 1,465 కి.మీ. మహారాష్ట్రలోని త్రయంబకం కొండల్లో పుట్టిన ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది సాంస్కృతిక, ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. లక్షలాది మంది ప్రజలకు గోదావరి జీవనాధారం. గోదావరి నదికి ప్రవర, మంజీర, పెన్ గంగా, వార్ధా, ఇంద్రావతి, శబరి వంటి అనేక ఉపనదులు ఉన్నాయి.

Latest Videos


కృష్ణా నది

భారతదేశంలో మూడవ అతిపెద్ద నది కృష్ణా. మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో కృష్ణా నది పుట్టింది. దాదాపు 1,400 కి.మీ పొడవు ఉంటుంది. ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. తుంగభద్ర, భీమ, ఘటప్రభ, మలప్రభ, మూసి వంటి అనేక నదులు కృష్ణా నదికి ఉపనదులు. కర్ణాటకలో ఉద్భవించిన తుంగభద్ర నది కృష్ణా నదికి అతిపెద్ద ఉపనదులలో ఒకటి.

యమునా: దాదాపు 1376 కి.మీ పొడవున్న యమునా నది భారతదేశంలో నాల్గవ అతిపెద్ద నది. ఈ నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశి జిల్లాలోని యమునోత్రి హిమానీనదాల నుండి ఉద్భవించింది. గంగా నదికి ఉపనది అయిన యమునా నది హిమాలయ ప్రాంతం, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహించి ప్రయాగ్‌రాజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది.

నర్మదా నది

భారతదేశంలో ఐదవ అతిపెద్ద నది నర్మదా. ఇది దాదాపు 1,312 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. నర్మదా సెంట్రల్ ఇండియా ప్రాంతంలో ప్రవహించే ఒక ప్రధాన నది. మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్ పీఠభూమి వద్ద ఈ నది పుట్టింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా పశ్చిమానికి ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. తవా, బర్నా, శక్కర్, హిరాన్ నదులు నర్మదా నదికి ప్రధాన ఉపనదులు. నీటిపారుదల, జలవిద్యుత్ ఉత్పత్తి ,నీటి సరఫరా కోసం ఈ నదిపై అనేక ఆనకట్టలు, రిజర్వాయర్లు నిర్మించారు. దేశంలోని ప్రసిద్ధ సర్దార్ సరోవర్ ఆనకట్ట కూడా గుజరాత్‌లోని ఈ నదిపైనే ఉంది.

సింధు: భారతదేశంలో 7వ పొడవైన నది సింధు నది. టిబెటన్ పీఠభూమిలోని మానసరోవర్ సరస్సు నుండి ఉద్భవించిన ఈ నది లడఖ్, జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల గుండా ప్రవహించి పాకిస్తాన్‌కు చేరుకుని చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుంది. 

బ్రహ్మపుత్ర: దేశంలో ఏడవ అతిపెద్ద నది అయిన బ్రహ్మపుత్ర నది హిమాలయాల్లోని కైలాష్ పర్వతం సమీపంలోని చెమాయుంగ్ హిమానీనదం నుండి పుట్టింది. ఈ ప్రాంతం చైనాలో ఉంది. బ్రహ్మపుత్ర నది మొత్తం పొడవు దాదాపు 2,900 కిలోమీటర్లు. కానీ ఈ నదిలో 918 కిలోమీటర్లు మాత్రమే భారతదేశంలో ఉన్నాయి. బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఆ రాష్ట్రంలో దీనిని సియాంగ్ నది అని పిలుస్తారు. ఇది గంగా, మేఘన నదులతో కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అయిన సుందర్బన్స్ డెల్టాను ఏర్పరుస్తుంది. తరువాత బంగాళాఖాతంలో కలుస్తుంది.

మహానది నది

భారతదేశంలో 8వ పొడవైన నది మహానది. 858 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లాలో ఉద్భవించిన ఈ నది తూర్పునకు ప్రవహిస్తుంది. ఇది చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. శివనాథ్, జోంక్, హస్డియో, ఒంగ్, టెల్ నదులు మహానదికి ప్రధాన ఉపనదులు. చత్తీస్‌గఢ్, ఒడిశాలో వ్యవసాయ ఉత్పత్తికి దోహదపడే నది నీటిని నీటిపారుదల కోసం విస్తృతంగా ఉపయోగిస్తారు.

కావేరి: భారతదేశంలో 9వ పొడవైన నది కావేరి. ఇది కర్ణాటకలోని కొడగు కొండల్లో పుట్టింది. కావేరి నది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గుండా తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది మొత్తం 800 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. హేమవతి, కబిని, అర్కావతి, శిమ్శా, అమరావతి వంటి అనేక నదులు కావేరి నదికి ఉపనదులు.

తపతి: తపతి నది భారతదేశంలో పదవ పొడవైన నది. మధ్యప్రదేశ్‌లోని సాత్పురా శ్రేణి నుండి ఉద్భవించిన ఈ నది మొత్తం పొడవు దాదాపు 724 కిలోమీటర్లు. ఇది మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది.

click me!