GNSS ఆధారిత టోల్ వసూలు విధానాన్ని భారత ప్రభుత్వం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ద్వారా పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఇది ప్రధానంగా కర్నాటకలోని బెంగలూరు-మైసూర్ హైవే, హర్యానాలోని పానిపట్-హిస్సార్ హైవేలపై అమలు చేశారు. భవిష్యత్తులో ఇది ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. GNSS వల్ల ప్రజలకు ఫ్యూయల్ ఖర్చు తగ్గుతుంది. ఎక్కడా వెహికల్ ఆగకుండా, ట్రాఫిక్ జామ్ లు లేకుండా త్వరగా గమ్యస్థానానికి చేరుకోవడానికి అవకాశం దొరుకుతుంది.