అయితే మధ్యలో ఓటీటీ ఫిల్మ్స్, వెబ్సిరీస్లో మెరిసింది. `పులిమేక`, `మిస్ పర్ఫెక్ట్` సిరీస్లో మెరిసింది. ఇక ఓటీటీకే పరిమితమనే వాదన కూడా వినిపించింది. దీనికితోడు మెగా ఫ్యామిలీ సినిమాలు చేయకూడదనే రిస్టిక్షన్ కూడా పెట్టినట్టు వార్తలు గుప్పుమన్నాయి.
ఈ క్రమంలో ఇటీవల వరుణ్ తేజ్ స్పందించాడు. ఒకప్పటిలా ఇప్పుడు లేదని, కాలం మారిందని, సినిమాలు చేయడానికి సమస్య లేదని తెలిపాడు. అన్నట్టుగానే ఇప్పుడు కొత్త సినిమాని ప్రకటించింది లావణ్య త్రిపాఠి. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీని ప్రకటించడం విశేషం.