రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు: ఖాతాదారులకు బ్యాంకులు మొండిచేయే...

First Published Aug 9, 2019, 12:40 PM IST

2019 ఆరంభం నుండి నిన్నటి వరకు ఆర్బీఐ నాలుగు దఫాలు వడ్డీ రేట్లను తగ్గించింది. మొత్తంగా 1.1శాతం మేర తగ్గించింది. ఇంతమేర ఆర్బీఐ తగ్గించినా బ్యాంకులు మాత్రం వినియోగదారులకు ఈ తగ్గిన రేట్ల మేర తమ వడ్డీరేట్లను తగ్గించడంలేదు.

2019 ఆరంభం నుండి నిన్నటి వరకు ఆర్బీఐ నాలుగు దఫాలు వడ్డీ రేట్లను తగ్గించింది. మొత్తంగా 1.1శాతం మేర తగ్గించింది. ఇంతమేర ఆర్బీఐ తగ్గించినా బ్యాంకులు మాత్రం వినియోగదారులకు ఈ తగ్గిన రేట్ల మేర తమ వడ్డీరేట్లను తగ్గించడంలేదు. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినా మన ఈ ఎం ఐలు ఎందుకు తగ్గడం లేదు?
undefined
Bank loans
undefined
మరి ప్రభుత్వమేమో మేము అంత తీసుకోవడం లేదు మా ఫిస్కల్ డెఫిసిట్ (ద్రవ్య లోటు) టార్గెట్లను మేము ఎప్పుడూ దాటలేదు అని లెక్కలు చూపెడుతుంది. (ప్రభుత్వం తన ఆదాయానికి మించి ఖర్చు పెడుతుంది. ఆ అదనపు మొత్తాన్ని అప్పుగా తీసుకుంటుంది. దీన్నే ద్రవ్య లోటు అంటూంటాము.) ఈ 2019-20 సంవత్సరానికి గాను ప్రభుత్వం జి డి పి లో 3.3శాతం మాత్రమే అప్పుగా తీసుకోనున్నట్టు ప్రకటించింది. కానీ వాస్తవానికి అసలు నిజాలు వేరు.
undefined
తాజా కాగ్ నివేదికలో ప్రభుత్వం ఈ లెక్కల్లో ఎలా తికమకలు చేసి ఈ టార్గెట్ ను చేరుకుంటుందో తెలిపింది. గత సంవత్సరం భారత ప్రభుత్వం నేరుగా కాకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ద్వారా లక్ష కోట్లను అప్పుగా తీసుకుంది. ఈ డబ్బును ఆహార భద్రత కొరకు ఖర్చు చేయడం జరిగింది. వాస్తవానికి ఈ లక్షకోట్లను వాడుకుంది ప్రభుత్వం. కాకపోతే వీటిని తమ అప్పుల్లో చూపెట్టదు. ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అప్పులు తీసుకుంటూనే మేము మాత్రం మా ద్రవ్య లోటు టార్గెట్లను మించిపోవడం లేదు అని చెబుతుంది.
undefined
ఈ విధంగా ప్రభుత్వరంగ సంస్థలు అధిక మొత్తంలో డబ్బులు తీసేసుకోవడం వల్ల ప్రైవేట్ సంస్థలకు ఏమి మిగలడం లేదు. తద్వారా ప్రైవేట్ పెట్టుబడులనేవి ఆర్ధిక వ్యవస్థలో ఆగిపోతున్నాయి. ఆర్ధిక ప్రగతికి ప్రభుత్వ ఖర్చు ఎంత ముఖ్యమో ప్రైవేట్ పెట్టుబడులు కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ ప్రభుత్వ పరంగా ఉన్న సమస్యలు. వాటి నిర్వహణా పరమైన సమస్యలు కూడా బ్యాంకులకు లేకపోలేదు. ఆ సమస్యలేంటో కూడా చూద్దాం.
undefined
దేశీయంగా ప్రజలు దాచుకునే సొమ్ము బ్యాంకులకు జీవనాధార వంటివి. వాటిమీద మాత్రమే బ్యాంకులు తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రజలకు ఇప్పుడు డబ్బులను దాచుకోవడానికి బ్యాంకులే కాకుండా రకరకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పోస్ట్ ఆఫీసుల దెగ్గర నుండి చిన్నమొత్తాల పొదుపు వరకు ప్రజలు తమకు ఇష్టంవచ్చిన వాటిలో ప్రజలు తమ డబ్బులను దాచుకునే వీలుంది. ఈ తరుణంలో ఈ ఆదాయ మార్గాన్ని కోల్పోడానికి బ్యాంకులు సిద్ధంగా లేవు. అందుకని వాటిపైన అధిక వడ్డీలను ప్రజాలకు అందిస్తున్నాయి. దీనితో రుణాలు తీసుకునే వారిపైన కూడా అధికంగా వడ్డీలను తప్పనిసరి పరిస్థితుల్లో వసూలు చేస్తున్నాయి.
undefined
వీటన్నిటికీ తోడు ఆర్ధిక మందగమనం. అన్ని రంగాల్లోనూ ఈ మందగమనం కనపడుతుంది. తద్వారా ప్రజల సంపాదన కూడా తగ్గింది. దీనితో ప్రజలు దాచుకునే సొమ్ము కూడా తగ్గింది. ఇలా పొదుపు తగ్గడంతో బ్యాంకులలో రుణాలను మంజూరు చేయడానికి సొమ్ము ఉండట్లేదు. ఉన్న కొద్దిపాటి డబ్బులో కూడా ప్రభుత్వం సింహ భాగం తీసుకోవడంతో ఉన్న కొద్ది డబ్బు కోసం ఎందరో వ్యక్తులు పోటీ పడుతుండడంతో వడ్డీరేట్లు ఆకాశంలోనే ఉంటున్నాయి.
undefined
ఇప్పటికైనా ఆర్ధిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. బ్యాంకులన్నింటినీ వారి వారి వడ్డీ రేట్లను తగ్గించేలా ప్రోత్సహించాలి. ఆలా ప్రోత్సహించినప్పుడు మాత్రమే ప్రజలు రుణాలుగా డబ్బును తీసుకొని ఖర్చు పెడతారు. అప్పుడు ఆర్థికంగా వృద్ధి జరుగుతుంది. ఆర్బీఐ తమ వడ్డీ రేట్లను తగ్గించినా బ్యాంకులు తగ్గించకపోతే, ఏదైతే ఆర్ధిక వృద్ధి కోసం ఆర్బీఐ ఈ చర్యలను తీసుకుందో అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే.
undefined
click me!