21 ఏళ్లలో రూ. 55 లక్షలు..
21 ఏళ్లలో రూ. 55 లక్షలు పొందడానికి పోస్టాఫీస్ అందిస్తోన్న సుఖన్య సమృద్ధి యోజన బెస్ట్ పథకంగా చెప్పొచ్చు. ఇందులో పెట్టుబడి పెట్టడం సురక్షితమైన మార్గంగా చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో మీ డబ్బుకు ఎలాంటి ఢోకా ఉండదు అలాగే గ్యారెంటీ రిటర్న్స్ పొందొచ్చు. ఉదాహరణకు మీ కూతురు పుట్టిన వెంటనే ఆమె పేరుతో సుఖన్య పథకంలో నెలకు రూ. 10 వేల చొప్పున పెట్టుబడి పెడుతూ వెళ్లారనుకుందాం.
21 ఏళ్ల తర్వాత మీ మొత్తం పెట్టుబడి రూ. 18,00,000 అవుతుంది. దీనికి 21 ఏళ్ల తర్వాత రూ. 37,42,062 వడ్డీ జమ అవుతుంది. ఇలా మీరు మెచ్యూరిటీ సమయానికి రూ. 55,42,062ని సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం సుకన్య పథకంలో 8.2 శాతం వడ్డీ అందిస్తున్నారు.