India pakistan tensions: భారత్ దెబ్బకు పాకిస్తాన్ లో క్రికెట్ బంద్ !

Published : May 11, 2025, 11:45 PM IST
 India pakistan tensions:  భారత్ దెబ్బకు పాకిస్తాన్ లో క్రికెట్ బంద్ !

సారాంశం

 India pakistan tensions: భారత్ దెబ్బతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అన్ని దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లను నిలిపివేసింది. సీఎస్ఎల్ సస్పెండ్ అయిన తర్వాత ఇది జరిగింది. దీంతో పాకిస్తాన్‌లో బంగ్లాదేశ్ రాబోయే టీ20 సిరీస్ గురించి ప్రశ్నలు లేవనెత్తుతోంది.

india Pakistan Tensions: భారత్ తో కయ్యానికి కాలు దువ్వి తనను తాను ఇబ్బందుల్లో పడేసుకుంటోంది పాకిస్తాన్. కాల్పుల విరమణ అంటూ తన వక్రబుద్దిని చూపిస్తూ భారత్ పై సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది. వీటిని ధీటుగా ఎదుర్కొంటున్న భారత్.. ఇప్పటికే పాకిస్తాన్ కు తగిన విధంగా బుద్దిచెబుతోంది. ఈ క్రమంలోనే భారత్ ఆపరేషన్ సింధూర్ బెబ్బతో పాక్ కు మరో షాక్ తగిలింది. దేశంలోని అన్ని క్రికెట్ టోర్నీలను నిలిపివేసింది. ఇటీవలే పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ను నిలిపివేసిన పాక్.. తాజాగా మిగతా దేశవాళీ టోర్నీలకు కూడా దీనిని వర్తింపజేసింది. 

 ప్రస్తుతం దేశంలో నెలకొన్న "భద్రతా పరిస్థితుల" కారణంగా, ప్రెసిడెంట్స్ ట్రోఫీ గ్రేడ్ II, రీజినల్ ఇంట్రా-డిస్ట్రిక్ట్ ఛాలెంజ్ కప్, ఇంటర్ డిస్ట్రిక్ట్ అండర్-19 వన్డే టోర్నమెంట్‌లను వెంటనే వాయిదా వేస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది.

ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్‌ఫో ప్రకారం, శనివారం జారీ చేసిన ఒక ప్రకటనలో, ఈ మూడు టోర్నమెంట్‌లు తాత్కాలికంగా నిలిపివేసిన పరిస్థితి నుంచే పరిస్థితులు మారిన తర్వాత ప్రారంభం అవుతాయి. సవరించిన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని పీసీబీ తెలిపింది.

పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్ఎల్) 2025 సీజన్‌లో కేవలం ఎనిమిది మ్యాచ్‌లు మిగిలి ఉండగానే నిరవధికంగా సస్పెండ్ చేయబడిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సిఫార్సుల మేరకు, పాకిస్తాన్-ఇండియా సరిహద్దులో పరిస్థితులు దారుణంగా ఉండటంతో సస్పెన్షన్ జరిగిందని పీసీబీ పేర్కొంది.

పీఎస్ఎల్ ప్రారంభం కష్టమేనా? 

మిగిలిన పీఎస్ఎల్ మ్యాచ్‌లను యూఏఈకీ మార్చాలనే ప్రణాళికలను పీసీబీ ప్రకటించిన 24 గంటలలోపే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, ఆ ప్రణాళికలను వెంటనే విరమించుకున్నారు. జట్లు ప్లేయర్లు, సిబ్బంది లేకుండా ఖాళీ అవుతున్నాయి. విదేశీ ఆటగాళ్ళు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లారు. దీంతో పీఎస్ఎల్ ఎప్పుడు తిరిగి ప్రారంభం కావచ్చనే దానిపై ఇంకా ఎలాంటి అప్‌డేట్ లేదు. 

ఇంతలో, పాకిస్తాన్‌లో బంగ్లాదేశ్ షెడ్యూల్ చేసిన టీ20 సిరీస్‌పై కూడా అనిశ్చితి నెలకొంది. ఈ పర్యటన మే 21న లాహోర్, ఫైసలాబాద్‌లలో మ్యాచ్‌లతో ప్రారంభం కానుంది. ఈ పర్యటన గురించి పీసీబీతో నిరంతర చర్చలు జరుపుతున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) పేర్కొంది. అయితే, ఈ ప్రాంతంలో పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు ఈ పర్యటన అవకాశాలపై సందేహాలను కలిగిస్తున్నాయి.

మూడు రోజుల ప్రెసిడెంట్స్ ట్రోఫీ గ్రేడ్ II ఏప్రిల్ మధ్యలో ప్రారంభమైంది, మే నాలుగో వారంలో ముగియాల్సి ఉంది, ఫైనల్ మే 22న ప్రారంభం కావాల్సి ఉంది. మిగిలిన రెండు టోర్నమెంట్‌లు కూడా మే నెలలో జరగాల్సి ఉంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో అత్యంత ఖరీదైన 6 ఆటగాళ్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?