"ఈ ప్రయత్నాలు చేసినప్పటికీ, ఇన్ కంట్రీ వాహన తయారీ ఉన్న దీర్ఘకాలిక లాభాల కోసం మేము ఒక స్థిరమైన మార్గాన్ని కనుగొనలేకపోయాము. ఈ నిర్ణయం సంవత్సరాలుగా పేరుకుపోయిన నష్టాలు, పరిశ్రమల సామర్థ్యం, భారతదేశంలో ఆశించిన వృద్ధి లేకపోవడం ద్వారా ఈ నిర్ణయానికి బలోపేతం చేసింది" అని అనురాగ్ మెహ్రోత్రా, ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు.
పునర్నిర్మాణం ద్వారా సుమారు 4,000 మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని భావిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రభావాలను తగ్గించడానికి న్యాయమైన, బ్యాలెన్స్ ప్లాన్ రూపొందించడానికి చెన్నై, సనంద్లోని ఉద్యోగులు, యూనియన్స్, సప్లయర్స్, డీలర్లు, ప్రభుత్వం ఇతర వాటాదారులతో ఫోర్డ్ సన్నిహితంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
ఫోర్డ్ ఇండియా ఢిల్లీ, చెన్నై, ముంబై, సనంద్ ఇంకా కోల్కతాలో పార్ట్స్ డిపోలను నిర్వహిస్తుంది. సేల్స్ అండ్ సర్వీస్ నుండి విడిభాగాలు ఇంకా సర్వీస్ సపోర్ట్ మార్పును సులభతరం చేయడానికి, పునర్వ్యవస్థీకరించడానికి డీలర్ నెట్వర్క్తో కలిసి పనిచేస్తుంది.