జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించని వారు శాంతిని కోల్పోతారని గరుడ పురాణం హెచ్చరిస్తోంది. పెద్దలను తక్కువగా చూడటం, వారితో కోపంగా ప్రవర్తించడం పాపంగా పరిగణిస్తారు. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం అంటే దేవుళ్లను పూజించడం లాంటిదే.
కృతజ్ఞత లేకపోవడం
తమకు సహాయం చేసిన వారిని గుర్తుపట్టకుండా, కృతజ్ఞత చూపకపోవడం కూడా నరకానికి దారి తీస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కృతజ్ఞత మనిషి జీవితాన్ని పవిత్రంగా నిలుపుతుంది.