Weather Update: పసిఫిక్ లో 2 తుపాన్లు.. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు అలర్ట్

Published : Aug 21, 2026, 08:30 AM IST

Weather Update: పసిఫిక్ మహాసముద్రంలో రెండు తుపాన్లు ఒకేసారి ఏర్పడటంతో పాటు, ఇటు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తోడుకావడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తీవ్రమయ్యే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. పలు ప్రాంతాలకు అలర్ట్ కొనసాగుతోంది.

PREV
15
బిగ్ అలర్ట్: ఈ జిల్లాల్లో పిడుగులు, 50 కిమీ వేగంతో ఈదురు గాలులు.. బయటకు వస్తే రిస్కే

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వ్యవస్థలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో సగటున 30 శాతం వరకు బలపడటంతో సముద్రాల ఉపరితల జలాలు విపరీతంగా వేడెక్కుతున్నాయి. ప్రస్తుతానికి పసిఫిక్ మహాసముద్రంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న 'లాలా' (Lala) తుపాను, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న 'సాడెల్' తుపాను భయపెడుతున్నాయి. ఇవి కాకుండా అదే పసిఫిక్ ప్రాంతంలో మరో 2 వాయుగుండాలు, 5 అల్పపీడనాలు కేంద్రీకృతమై ఉన్నాయి. సముద్రాలు వేడెక్కడం వల్ల ఏర్పడిన ఈ గ్లోబల్ పరిస్థితుల ఎఫెక్ట్ మన తెలుగు రాష్ట్రాలపైనా పడింది. నైరుతి రుతుపవనాల్లో తేమ తగ్గిపోవడంతో సాధారణ వర్షపాతం నెమ్మదించింది.

25
బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆగస్టు 28 వరకు జల్లులు

గ్లోబల్ గా వేడి పెరుగుతున్నప్పటికీ, స్థానికంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు ఉపశమనం లభించనుంది. ఆగస్టు 21 నుంచి ఈ నెల 28 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వాతావరణం మారనుంది. ఆగస్టు 21 నుంచి 26 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ఇటీవలి వాయుగుండం ప్రస్తుతం మధ్యప్రదేశ్ వైపునకు బలహీనపడి వెళ్లినప్పటికీ, కొత్త అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కొనసాగుతుంది.

35
తెలంగాణ వెదర్ అప్‌డేట్: 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉండి, మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో జల్లులు పడే అవకాశం ఉంది. సగటు ఉష్ణోగ్రతలు 28°C నుండి 34°C మధ్య నమోదు కానున్నాయి. తేమ శాతం 46% నుండి ఉత్తర జిల్లాల్లో 60% పైగా ఉండటంతో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గంటకు 37 కిలోమీటర్ల వేగంతో చల్లని ఈదురుగాలులు వీస్తాయి. వర్ష సూచన నేపథ్యంలో ఐఎమ్‌డీ తెలంగాణలోని 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

• ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు: ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్.

• హైదరాబాద్, ఇతర ప్రాంతాలు: హైదరాబాద్‌లో 28°C-30°C ఉష్ణోగ్రతలతో సాయంత్రం వేళల్లో తేలికపాటి జల్లులు పడతాయి. వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల్, సిద్దిపేట జిల్లాల్లో కూడా అక్కడక్కడా వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

45
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి: పిడుగులు, ఈదురుగాలుల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం వెచ్చగా, అధిక తేమతో (46%) కూడి ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 33°C నుండి 36°C (తిరుపతిలో 38°C వరకు) నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 35 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. తీర ప్రాంతాల్లో భారీ అలలు వచ్చే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది.

• భారీ వర్షాలు & పిడుగుల హెచ్చరిక: పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• మోస్తరు వర్షాలు: కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయి.

• ఇతర ప్రాంతాలు: విజయవాడ, రాయలసీమ, మిగిలిన కోస్తా జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తాయి.

55
రైతులకు బిగ్ అలర్ట్: ఎల్ నినో ఎఫెక్ట్ తో ప్రత్యామ్నాయ సాగు బాట

అల్పపీడనాలు వస్తున్నప్పటికీ, ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాల నుంచి అందాల్సిన స్థాయిలో భారీ వర్షాలు పడలేదు. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో కొత్త ఆవర్తనాలు ఏర్పడటానికి మరో వారం పైనే సమయం పట్టేలా ఉంది. ఆగస్టు నెలాఖరు వరకు అత్యత భారీ వర్షాలు పడే సూచనలు కనిపించడం లేదు. సెప్టెంబర్‌లో ఈశాన్య రుతుపవనాలు పుంజుకుంటే తప్ప వర్షపాత లోటు భర్తీ కాదు.

భూగర్భ జలాలు అడుగంటి, సాగునీరు అందక పంటలు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో రైతులు కేవలం వర్షాలపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ నీటి మార్గాలను చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్షాభావ పరిస్థితులపై అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు వేసేలా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇక వర్షాలు, ఉరుములు వచ్చే సమయంలో బైక్‌లపై ప్రయాణించేవారు వేగవంతమైన గాలుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల కింద నిలబడకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories