తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం కొనసాగుతోంది. ఇటు శీతాకాలం, అటు వేసవి కాలం మధ్యలో ఉన్నాాం కాబట్టి చలి, ఎండ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం కొనసాగుతోంది. ప్రస్తుతం శీతాకాల ఎండింగ్ కు చేరుకుంది... సమ్మర్ ప్రారంభం అవుతోంది... ఈ క్రమంలో చలితో పాటు ఎండలు కొనసాగుతున్నాయి. ఇవి చాలవన్నట్లు సమ్మర్ ఆరంభంలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇలా ఈ నెలలో చలి, ఎండా, వానతో విచిత్రమైన పరిస్థితులు ఉండే అవకాశాలున్నాయి.
25
ఏపీలో మినీ సమ్మర్..
ఆంధ్ర ప్రదేశ్ లో మినీ సమ్మర్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో చలి కొనసాగుతోంది... అదే క్రమంలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా విజయవాడ-అమరావతి, గుంటూరు, కడప, నంద్యాల, కర్నూలు, తిరుపతి వంటి నగరాల్లో ఎండలు ముదిరాయి. దీంతో ఉదయం, రాత్రులు చలి... మధ్యాహ్నం ఎండలు, ఉక్కపోత ఇబ్బంది పెడుతున్నాయి.
35
ఈ ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు
రాబోయే రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉదయం 11 నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఉష్ణోగ్రతలు 35-38 డిగ్రీలకు చేరే అవకాశాలున్నాయని ఆంధ్ర ప్రదేశ్ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. సమ్మర్ ఆరంభంలోనే ఇలా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పగలంతా వేడి, ఉక్కపోత ఉంటే రాత్రులు మాత్రం ఉష్ణోగ్రతలు 16-19 డిగ్రీలకు పడిపోయి వాతావరణం చల్లగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఫిబ్రవరి, మార్చి నెలల్లో వాతావరణ మార్పుల వల్ల ఉదయం వేళల్లో మంచు ఎక్కువగా ఉంటుందని ఏపీ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గి ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంటుంది... కాబట్టి ఉదయం 8 లేదా 9 గంటల తర్వాత ప్రయాణాన్ని మొదలుపెడితే మంచిది... సాయంత్రం 6 గంటలకల్లా ముగించడం క్షేమకరం అని ఏపీ వెదర్ మ్యాన్ సూచించారు.
55
తెలంగాణ వాతావరణం
ఇక తెలంగాణ విషయానికి వస్తే గురువారం నుండి ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఉత్తరాదినుండి పొడిగాలులు కొనసాగడమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. గత కొద్దిరోజులుగా సాధారణంగా శీతాకాలం ఎండింగ్ లో ఉండే ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి... కానీ ఇవాళ్టి (శుక్రవారం) నుండి చివరగా కోల్డ్ స్పెల్ మొదలవుతుందని.. మళ్లీ చలిగాలుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతాయని వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.