హైదరాబాద్ నుండి ఈ నగరాలకూ బుల్లెట్ ట్రైన్స్..
ఏపీ రాజధాని అమరావతి గురించే కాదు తెలంగాణ రాజధాని హైదరాబాద్ గురించి కూడా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఐటీ సిటీ నుండి దక్షిణాది రాష్ట్రాల్లోనే ప్రధాన నగరాలన్నింటికి బుల్లెట్ ట్రైన్స్ నడుపుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు బుల్లెట్ ట్రైన్ లో హైదరాబాద్ నుండి ఏఏ నగరాలకు ఎంత సమయంలో చేరుకోవచ్చో వివరించారు.
హైదరాబాద్ - అమరావతి : 70 నిమిషాలు
హైదరాబాద్ - పూణే : 155 నిమిషాలు
హైదరాబాద్ - బెంగళూరు : 2 గంటల 8 నిమిషాలు
హైదరాబాద్ - చెన్నై : హైదరాబాద్ నుండి అమరావతికి 70 నిమిషాలు... అక్కడినుండి చెన్నైకి 112 నిమిషాలు... అంటే హైదరాబాద్ నుండి చెన్నైకి ప్రయాణ సమయం 182 నిమిషాలు (దాదాపు 3 గంటలు) అన్నమాట.
పూణే - ముంబై : 48 నిమిషాలు. అంటే హైదరాబాద్ నుండి పూణేకు 155 నిమిషాలు... అక్కడినుండి ముంబైకి 48 నిమిషాలు... మొత్తంగా హైదరాబాద్ నుండి ముంబైకి 203 నిమిషాలు (దాదాపు మూడున్నర గంటలు) పడుతుంది.
ఇక చెన్నై నుండి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ లో 73 నిమిషాల సమయం పడుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.