Real Estate : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇక్కడ జరుగుతున్న కొన్ని ప్రాజెక్టులు జిల్లాలో రియల్ ఎస్టేట్ బూమ్ కారణం అవుతున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మూడు పువ్వులు కాయలు అన్నట్లు సాగుతోంది. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత రాజధానిపై క్లారిటీ వచ్చేసింది... అమరావతిలో నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. దీంతో రియల్ బూమ్ పెరిగింది. అయితే ఈ స్థాయిలో ఓ రాయలసీమ జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి... మరి ఆ జిల్లా ఏది..? ఇక్కడే రియల్ ఎస్టేట్ బూమ్ ఏర్పడానికి కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
25
చిత్తూరులో రియల్ బూమ్...
ఉమ్మడి చిత్తూరు... ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా. అందుకే ఇతర ప్రాంతాలకు ఆదర్శనం నిలిచేలా ఈ జిల్లాను తీర్చిదిద్దేందుకు సీఎం సిద్దమయ్యారు... ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ డెవలప్మెంట్ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. ఇందులో భాగమే చిత్తూరు నుండి బెంగళూరు, చెన్నైలకు నూతన హైవేల నిర్మాణం. ఇందుకోసం ఏకంగా ఎనిమిదివేల కోట్లకు పైగా నిధులను కేటాయించారు.
35
చిత్తూరు నుండి చెన్నైకి ఎక్స్ ప్రెస్ హైవే
ఇప్పటికే చిత్తూరు నుండి తచ్చూరుకు 2022 లో ప్రారంభమైన ఎక్స్ ప్రెస్ హైవే పనులు పూర్తయ్యాయి. ఈ ఎక్స్ ప్రెస్ హైవే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే 75 కిలోమీటర్లు ఉంటుంది... ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇదే జరిగితే చిత్తూరు నుండి చెన్నైకి ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. ప్రస్తుతం ఈ హైవే చుట్టుపక్కల భూముల ధరలు ఆకాశాన్ని అంటాయి... రియల్ బూమ్ పెరిగింది.
ఇదిలా ఉంటే చెన్నై-బెంగళూరు ఎక్స్ ప్రెస్ హైవే కూడా ఉమ్మడి చిత్తూరు మీదుగా వెళుతోంది. దీని పనులు కూడా దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి... ఈ ఏడాది చివర్లో ఇది అందుబాటులోకి రానుంది. ఈ హైవే కూడా చిత్తూరులో రియల్ ఎస్టేట్ బూమ్ కి కారణం అవుతోంది... దీని పరిసరాల్లో భూముల ధరలు పెరిగాయి.
55
విశాఖపట్నంలో రియల్ బూమ్
ఇక విశాఖపట్నంలో కూడా రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోంది. ఈ నగరంలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు అందిస్తోంది... దీంతో చాలా కంపెనీలు ఇప్పటికే విశాఖకు తరలివస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ వంటి భారీ ప్రాజెక్టులు విశాఖకు వస్తున్నాయి. దీంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటోంది.