Pawan Kalyan : మాట తప్పని జనసేనాని.. ఆ గ్రామం దశ మారిపోయింది !

Published : Feb 21, 2026, 06:37 PM IST

Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్న కొణిదెల గ్రామంలో రూ. 6 కోట్లతో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. సొంత నిధులు రూ. 50 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంక్ త్వరలో ప్రారంభం కానుంది.

PREV
15
పవన్ కళ్యాణ్ అడ్డాలో అభివృద్ధి జాతర

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నంద్యాల జిల్లాలోని కొణిదెల గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. నందికొట్కూరు మండల పరిధిలోకి వచ్చే ఈ గ్రామం, ఉపముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఇప్పుడు మహర్దశను సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పవన్ కళ్యాణ్ ఈ గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేయించడమే కాకుండా, తన సొంత విరాళంతో కీలక సమస్యలను పరిష్కరిస్తున్నారు.

25
సొంత నిధులతో తాగునీటి కష్టాలకు చెక్

కొణిదెల గ్రామ ప్రజల ప్రధాన సమస్య అయిన తాగునీటి ఎద్దడిని తీర్చడానికి పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుంచి రూ. 50 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు. గతంలో ఆయన ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఈ నిధులను విడుదల చేశారు. జిల్లా అధికారుల సూచనలతో, ఈ రూ. 50 లక్షల వ్యయంతో గ్రామంలో 90,000 లీటర్ల సామర్థ్యం కలిగిన రక్షిత తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ ట్యాంక్ ద్వారా సుమారు 2 వేల మంది గ్రామస్తులకు స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. వేసవి కాలం ప్రారంభానికి ముందే ఈ పనులు పూర్తి కావడం పట్ల పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. సకాలంలో పనులు పూర్తి చేసిన గ్రామీణ నీటి సరఫరా విభాగం, జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.

35
రూ. 6 కోట్లతో గ్రామాభివృద్ధి పనులు

కేవలం తాగునీటికే పరిమితం కాకుండా, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా సుమారు రూ. 6 కోట్లకు పైగా నిధులను పవన్ కళ్యాణ్ కొణిదెల గ్రామానికి కేటాయించారు. పల్లెపండగ 1.0 కింద రూ. 20 లక్షలతో మూడు అంతర్గత సి.సి. రోడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యింది. ప్రస్తుతం పల్లెపండగ 2.0 కింద రూ. 45 లక్షల అంచనా వ్యయంతో మరో ఏడు సి.సి. రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ ప్లాన్ నిధుల ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు.

45
మెరుగైన రహదారులు.. మౌలిక వసతులు

గ్రామంలోని రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారీగా నిధులు వెచ్చించారు. కొణిదెల జిల్లా పరిషత్ స్కూల్ నుండి లక్ష్మాపురం వరకు 5 కిలోమీటర్ల మేర బి.టి. రోడ్డు నిర్మాణానికి రూ. 4 కోట్లు మంజూరు చేశారు. అలాగే, ఆర్ అండ్ బి రోడ్డు నుంచి గ్రామానికి వచ్చే రహదారి పునరుద్ధరణ కోసం రూ. 45 లక్షలు కేటాయించారు. ప్రజల అభ్యర్థన మేరకు గృహ నిర్మాణ శాఖ సహకారంతో 19 ఇళ్లు, 4 పశువుల షెడ్లు, నీటి తొట్టెలను నిర్మించారు.

55
రైతులకు ప్రాధాన్యం.. సాగునీటి వనరుల పునరుద్ధరణ

రైతు సంక్షేమమే ధ్యేయంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద 49 ఫీడర్ ఛానల్స్ అభివృద్ధి చేశారు. వ్యవసాయానికి సాగునీరు అందించేలా రెండు మైనర్ కాలువల పునరుద్ధరణ పనులను పూర్తి చేయడంతో పాటు, మూడు కమ్యూనిటీ చెక్ డ్యామ్స్ మరమ్మతులు కూడా పూర్తయ్యాయి. 2019 ఎన్నికల సమయంలో గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ఇచ్చిన హామీని పవన్ కళ్యాణ్ అక్షరాలా అమలు చేస్తున్నారు. తన ఇంటి పేరుతో ఉన్న గ్రామం కావడంతో, ఆ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories