ఫిబ్రవరి 22, 23, 24 తేదీల్లో జోరువానలు...
ఫిబ్రవరి 21న ప్రారంభమయ్యే వర్షాలు తర్వాతి మూడు రోజులు అంటే ఫిబ్రవరి 22, 23, 24 తేదీల్లో మరింత విస్తరించనున్నాయని APSDMA వెదర్ రిపోర్టు తెలియజేస్తోంది. ఫిబ్రవరి 22 (ఆదివారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయట. ఇక నెల్లూరు, కడప, అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కొనసాగుతాయని ఏపి విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.