తీరాన్ని తాకిన మొంథా తుపాను

Published : Oct 28, 2025, 08:07 PM ISTUpdated : Oct 28, 2025, 08:29 PM IST

Montha cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీరాన్ని తాకింది. మరో 3 – 4 గంటల్లో తీవ్రమైన ఈదురుగాలులు, వర్ష ప్రభావం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. బయటకు రావొద్దని హెచ్చరించారు.

PREV
14
కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన మొంథా తుపాను

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను వేగంగా ముందుకు సాగుతూ తీరాన్ని తాకింది. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరాన్ని ఇప్పటికే తాకింది. మరి కొన్ని గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

వివరాల్లోకెళ్తే.. కాకినాడ, మచిలీపట్నం తీరాల మధ్య మొంథా తీవ్ర తుపాను ప్రభావం ప్రారంభమైంది. గత ఆరు గంటలలో సుమారు గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగిన ఈ వ్యవస్థ, ప్రస్తుతం మచిలీపట్నం నుంచి 20 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 110 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

రాబోయే 3 నుంచి 4 గంటల్లో కాకినాడ సమీప తీరాన్ని పూర్తిగా దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో తీరప్రాంతాల్లో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.

24
తుపాను అలర్ట్

ప్రజలు ఇళ్ల బయటకు రావద్దని, జాగ్రత్తలు పాటించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచనలు జారీ చేశారు. తీరం వెంబడి గంటకు 90–100 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రాంతీయ అధికారులు తీర ప్రాంత ప్రజల కోసం భద్రతకు చర్యలు తీసుకోవాలనీ, ముందస్తు సమాచారంతో అప్రమత్తంగా ఉండేలా చూడాలని కోరారు.

34
తుపాను ఎఫెక్ట్.. బయటకు రావొద్దు

మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. తీరప్రాంతాల్లో ఇప్పటికే ఈదురుగాలుల వేగం పెరుగుతోందని తెలిపారు.  ప్రభావిత గ్రామాల నుండి ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అత్యవసర అవసరాలు తలెత్తితే మాత్రమే బయటకు రావాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ అంతరాయం ఏర్పడే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, జిల్లా కలెక్టర్ల మార్గదర్శకత్వంలో జనరేటర్లు అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు.

44
ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు

మొంథా తుపాను తీరం దాటుతున్న ప్రభావం కొనసాగుతుండటంతో  బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగనున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ తాజా అప్‌డేట్ ప్రకారం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశముంది.

ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా అనేక చోట్ల భారీవర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం ప్రాంతాల్లో కూడా మోస్తరు నుండి భారీవర్షాలు పడే అవకాశముందని తెలిపింది.

Read more Photos on
click me!

Recommended Stories