సైబర్ నేరగాళ్లు ముందుగా మంత్రికి సన్నిహితులు, పార్టీ నాయకులను టార్గెట్ చేశారు. నేరగాళ్లు నారా లోకేశ్ పేరు, ఫొటోలను ఉపయోగించి ఒక నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించి, అత్యవసరంగా నిధులు కావాలని చెప్పి బాధితులను మోసగించారు.
పుట్టపర్తికి చెందిన రాజేష్ అనే నిందితుడు ఎన్నారై తెదేపా (తెలుగు దేశం పార్టీ) పేరుతో కూడా గతంలో మోసాలకు పాల్పడినట్టు తెలిసింది. వైద్య సాయం పేరుతో ఇప్పటివరకు సుమారు రూ.50 లక్షలకు పైగా వసూలు చేశాడని అధికారులు గుర్తించారు.
సీఐడీ గతంలోనే రాజేష్ను అరెస్ట్ చేసి విచారణ జరిపింది. అతడు ఇచ్చిన వివరాలతో మిగతా నిందితుల జాడలు సీఐడీకి దొరికాయి. తాజాగా హైదరాబాద్లో సాయిశ్రీనాథ్, సుమంత్ అనే మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.