భారీ వర్షాలతో అల్లకల్లోలం.. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ
తుపాను ముప్పు నేపథ్యంలో వాతావరణ శాఖ మూడు రకాల హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత ప్రమాదం ఉన్న జిల్లాలుగా పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
చిత్తూరు, తిరుపతి, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పుగోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాలపై తుపాను ప్రభావం వుంటుందని హెచ్చరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తీరప్రాంతాల్లో సముద్ర అలలు చాలా ఎత్తుగా ఎగసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరిలు ఇచ్చారు.