తుఫాను ప్రభావంతో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో సోమవారం ఉత్తర ఆంధ్రాలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ వర్గాలు హెచ్చరించాయి.
ఈ ప్రాంతాల్లో తుపాను ప్రభావం
• కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు అంచనా వేశారు.
• శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి.
• మధ్య, దక్షిణ జిల్లాలైన ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
• తీవ్రమైన గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రజలు ఇంట్లోనే సురక్షితం, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.